DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమాజ నడవడిక కు  ప్రత్యక్ష సాక్షి మీడియానే:ఆడారి కిషోర్ కుమార్  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, నవంబర్ 03, 2023 (డి ఎన్ ఎస్):* సమాజం లో జరిగే ప్రతి అంశానికి ప్రత్యక్ష సాక్షిగా పాత్రికీయ రంగం నిలిచిందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులూ ఆడారి కిషోర్ కుమార్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, చోడవరం శాఖ ఆధ్వర్యవం లో అనకాపల్లి జిల్లా చోడవరం లో

జరిగిన సమావేశంలో అయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం అభివృద్ధి చెందడం లో మీడియారంగం కీలక పాత్ర వహించిందన్నారు. గతం లో ఒక సమాచారం మరొక చోటకు చేరాలంటే రోజులు సమయం పట్టేదని, మరి నేటి రోజుల్లో మరు క్షణం లో గమ్య స్థానానికి ప్రత్యక్షంగానే చేరుతోందన్నారు. 

పాత్రికీయులు కొన్ని

నిబంధనలు దాటి బయటకు రాలేని పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తునంరన్నారు. మీడియా రంగానికి స్వయం ప్రతిపత్తి ఉండాలని, ఎవరి ఒత్తిళ్లు, ఉక్కుపాదం మోపకుండా ఉండేలా చట్టాలు అందుబాటులోకి రావాలన్నారు. ఈ రంగం నుంచి అత్యున్నత హోదాల్లోకి వెళ్లిన వాళ్ళు ఎందరో ఉన్నారన్నారు. నేటి తరంలో జర్నలిస్ట్ లకు జీవనోపాధి సైతం ఇబ్బంది

కరంగా మారిందన్నారు. విలువలకు, నిజాయితీ కి కట్టుబడి మీడియాల్లో పని చేసేవాళ్లకు తగిన గుర్తింపు కూడా లేదన్నారు.  ఎంతో విజ్ఞానం, అనుభవం, విశ్లేషణ తో కూడిన వార్తలు వ్రాయగలిగిన నైపుణ్యం ఉన్నవారు నేటి మీడియా సమాజంలో ఉన్నారని, అలాంటి వారికీ తగిన గుర్తింపు వచ్చేలా వ్యవస్థలు కృషి చేయాలన్నారు. 

ఈ సమావేశంలో ఏపీ

డబ్ల్యు జె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు, విశాఖ జిల్లా ఏపీ డబ్ల్యు జె ఎఫ్ అధ్యక్షులు పి . నారాయణ,  ఏపీ బిజె ఏ జిల్లా అధ్యక్షులు ఈశ్వర్ రావు, చోడవరం ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, పాత్రికీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam