DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సామాన్యుల సమస్యల పరిష్కారానికై కదిలి వచ్చిన కలెక్టర్ యంత్రాంగం

విశాఖ చౌల్ట్రీ వేదికగా జగనన్నకు చెబుతాం వేడుకకు విస్తృత స్పందన 

*(DNS Report: Ganesh Reddy BVS, Visakhapatnam)*

*విశాఖ పట్నం, నవంబర్ 08, 2023 (డి ఎన్ ఎస్):* క్షేత్ర స్థాయిలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు విశాఖ జిల్లా కలెక్టర్ యంత్రాంగం మొత్తం కదిలి వచ్చింది. బుధవారం విశాఖ నగరం లోని టర్నర్

చౌర్ల్ట్రీ లో గల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం కు బృహత్తర స్పందన లభించింది.  

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఏ. మల్లిఖార్జున మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అండగా నిలిచేందుకు 
గ్రామా స్థాయిలో జగన్నన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ఈ గ్రామంలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి

సోమవారం జిల్లా కెలక్టర్ కార్యాలయం లో నిర్వహిస్తున్న స్పందన ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నప్పడికి అక్కడికి రాలేని సామాన్య ప్రజల కోసం ఈ బృహత్తర కార్యక్రమమని శ్రీకారం చుట్టామన్నారు.  

సాక్షాత్తు జిల్లా కలెక్టర్ డా. మల్లిఖార్జున కదిలి వచ్చారు. దీంతో సంయుక్త కలెక్టర్ విశ్వనాథన్, ఆర్డీఓ, ఇతర

కలెక్టర్ కార్యాలయ అధికారులు అందరూ తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల విఆర్ఓ లు సభకు హాజరైన కక్షిదారులు వివరాలను పరిశీలించి, ఆన్లైన్ లో ఫిర్యాదులను నమోదు చేశారు.   

స్థానిక శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ సైతం పాల్గొని, స్థానికులకు సంబంధించిన సమస్యలను కలెక్టర్ బృందానికి వివరించారు. 

ప్రజా

సమస్యలు వినేందుకు నేరుగా జిల్లా కలెక్టర్ తమ ప్రాంతానికి రావడంతో ఈ కార్యక్రమం లో పాల్గొనేందుకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. 
ప్రధానంగా రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పయిన వారు, వన్ టౌన్ ప్రాంతంలో కాలుష్య భూతం నుంచి రక్షించమని కొందరు, ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాల్లో

కేటాయింపులు జరగని వారు, మత్స్యకార ప్రాంతాలకు చెందిన స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తదితర విషయాలపై ఫిర్యాదులు అందించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam