DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వేద విద్యా ప్రసాదం  సర్వం ఆచార్య అనుగ్రహమే: సంతోష్ స్వామి 

*ఆచార్యుల సాక్షిగా జీయర్ అవార్డు గ్రహీత ఉద్వేగ భాషణం*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం / విజయవాడ, నవంబర్ 13, 2023 (డి ఎన్ ఎస్):* విద్యార్థి దశ నుంచి ఉన్నత స్థితికి చేరుకునే వరకూ ఆచార్యుల అనుగ్రహం ఉంటుంది అనే పెద్దల వాక్కుకు ప్రత్యక్ష నిదర్శనం త్రిదండి చిన్న జీయర్ స్వామి. వేలాదిమంది

ప్రత్యక్ష, పరోక్షం సాక్షిగా జీయర్ పురస్కార వేదిక పై దర్శనమిచ్చింది. 
సీతానగరం జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లో త్రిదండి చిన్న జీయర్ స్వామి తిరునక్షత్ర మహోత్సవం సందర్బంగా జరిగిన వేడుకల్లో విశాఖ వారిజ ఆశ్రమం లోని శుక్ల యజుర్వేద అధ్యాపకులు సంతోష్ కుమార్ స్వామి కి జీయర్ పురస్కారం అందించారు. ఈ సందర్బంగా అయన తన జీవన

గమనం అందరికి తెలియచేసారు. 

శ్రీవైష్ణవ కుటుంబాల్లో వేదం నేర్చుకునే వారు చాలా అరుదుగా ఉంటారని, చిన్న జీయర్ స్వామి వారి ప్రోత్సాహంతోనే నేడు వందల సంఖ్యలో వేద విద్య అభ్యసిస్తున్నారన్నారు. 

తన చిన్నతనం లోనే తల్లిదండ్రులకు దూరమై, అమ్మమ్మ గారింటింకి చేరడం జరిగిందన్నారు. 1995 ల్లో ఆచార్యులు చిన్న

జీయర్ స్వామి విశాఖ లో నిర్వహించిన విరాట్ విష్ణు సహస్రనామ వేడుకల్లో ఉపనయనం జరిగిపించిన సమయంలో వారి దర్శన భాగ్యం కల్గిందన్నారు. ఆ వెంటనే అమ్మమ్మ గారికి స్నేహితుల సహకారంతో జీయర్ స్వామి వారి వేదపాఠశాలలో చేరడం జరిగిందన్నారు. మొదట్లో వేరొక విభాగంలో శిక్షణ పొందినా, తదుపరి తాము శుక్ల యజుర్వేద సంబంధీకులమని తెలిసి,

స్వామి ఆ వేదం నేర్పించే గురువుల వద్దకు పంపడం జరిగిందన్నారు. ఈ విద్య ప్రయాణం లో సీతానగరం వేదపాఠశాల లో చేరి, ఋగ్వేదం అధ్యయనం కోసం గురువులతో సోమశిల ఆశ్రమం కు వెళ్లడం జరిగిందని తెలిపారు. ఆ సమయంలోనే తాము శుక్ల యజుర్వేదం కాణ్వ శాఖ కు చెందిన వారు అని తెలిసిందన్నారు. ఆచార్యుల అనుగ్రహం తో  2002 నాటికి శుక్ల యజుర్వేదం కాణ్వ

శాఖ మూలం పూర్తి చేసుకోగలిగామన్నారు. 2003 లో విశాఖ సాగర తీరంలో వారిజ ఆశ్రమం ప్రారంభించి, చిన్న జీయర్ స్వామి వారు చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తున్న సమయంలో జూనియర్ గురువులుగా వేద సేవ చేసుకునే భాగ్యం కల్గించారన్నారు. ఘానంతం నేర్చుకునేందుకు ఆజ్ఞ కోరితే చెన్నై లోని మైలాపురం పంపారన్నారు. వేద అధ్యాపకులకు తిరుమల క్షేత్రం

లోని ధర్మగిరి వేదపాఠశాల లో చేరడం తో తాము కూడా తిరుమలకు చేరుకున్నామని, అక్కడే ఘానంతం పూర్తి చేసుకోగలిగామన్నారు. తదుపరి సలక్షణం కూడా అందుకున్నరంని వివరించారు,
నాడు విద్యార్థి దశ నుంచి నేటి జీయర్ పురస్కారం వరకూ అన్ని పట్టాలు, పురస్కారాలు ఇదే సీతానగరం వేదపాఠశాల ఆశ్రమంలోనే ఆచార్యుల చేతుల మీదుగా తీసుకోవడం తమ జీవన

సాఫల్యం అన్నారు. ఆచార్యులు తమకు ఇచ్చిన ఆదేశం ప్రకారం వారిజ ఆశ్రమం లో విద్యార్థులకు ఘానంతం, క్రమాంతం పూర్తి చేయించగలిగామన్నారు. 

రెండు దశాబ్దాల క్రితం ముందు వరకూ వేదవిద్య నేర్చుకోవడం అంటే అగమ్యగోచరం అన్నారు. ఆచార్యులు చిన్న జీయర్ స్వామి వారి మనో సంకల్పం ఫలితంగా వందలాది మంది సామాన్య విద్యార్థులు సైతం

వేద పండితులుగా తయారవుతున్నారన్నారు. సాక్షాత్తు ఆచార్యులే కదిలి వచ్చి వేద విద్యా వ్యాప్తి ఉద్యమాన్ని ఉధృతం గా ప్రచారం చేస్తున్న మహనీయులన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam