DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోషా మహల్ వేదికగా గర్జించనున్న రెండు బీజేపీ సింహాలు 

*శనివారం భాగ్య నగరానికి యూపీ సి ఎం యోగి రాక* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*భాగ్యనగరం / విశాఖ పట్నం, నవంబర్ 25, 2023 (డి ఎన్ ఎస్):* తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపుకోసం సాక్షాత్తు జాతీయ స్థాయి నేతలు రంగం లోకి దిగారు. ఒక వైపు ప్రతిపక్ష పార్టీలు

తంత్రాలు, కుతంత్రాలు జరిపి బీజేపీ అభ్యర్దులపై అసత్య ఆరోపణలు చేస్తూ యధాశక్తి వాళ్ళ కుబుద్ధి బయట పెట్టుకుంటుంటే. .బీజేపీ దీన్ని బెఖాతరు చేస్తోంది. అయితే విపక్షాలకు సమాధానం ఇవ్వడం కంటే. . తమ అభ్యర్థుల గెలుపు పైనే బీజేపీ పూర్తి దృష్టి సారించింది. దీనికోసం సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా లు

విస్తృతంగా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. వీరికి తోడు తమిళనాట బీజేపీ ని తారాస్థాయి లోకి తీసుకు వెళ్తున్న తమిళసింగం అన్నామలై ఇప్పడికే ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. 
శనివారం తెలంగాణ ఎన్నికల్లో సంచలనం జరుగనుంది. మాటలు తక్కువ, చేతలు ఎక్కువ చేస్తూ దేశం యావత్తు ప్రతిపక్షాలను గడగడలాడిస్తున్న పొలిటికల్ షేర్ ఉత్తర

ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ శనివారం భాగ్యనగరానికి రానున్నారు. 
రెండు తుఫాన్లు ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో చూసినవాళ్లు తక్కువగా ఉంటారు. అయితే శనివారం ఆ దృశ్యాన్ని భాగ్యనగరం ప్రజలు చూడనున్నారు అని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. యోగి గోషామహల్ ప్రాంతంలో ప్రచారం చేయనున్నారు. ఈ ప్రాంతం అభ్యర్థిగా బరిలో

దిగిన రాజాసింగ్ ఇప్పడికే ప్రతిపక్షాలకు నిద్రలేకుండా చేసేసారు. శనివారం యోగి తో సహా రాజాసింగ్ ఒకే వేదిక నుంచి ప్రసంగించనున్నారు. 
దీంతో మొత్తం తెలంగాణ ఎన్నికల ప్రచారం దృష్టి గోషామహల్ వైపే చూస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam