DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ జూ పార్క్ లో అధికారుల నిర్లక్ష్యానికి ఓ ఉద్యోగి మృతి 

*జనం చూస్తుండగానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై ఎలుగుబంటి దాడి*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, నవంబర్ 27, 2023 (డి ఎన్ ఎస్):* సందర్శకులు అందరూ చూస్తుండగానే విశాఖ జూ లో ఓ ఉద్యోగి పై ఎలుగుబంటి దాడి చేసిన ఘటనలో అతను చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తోంది.  విశాఖ నగరానికే తలమానికంగా

నిలిచిన ఇందిరా జూలాజికల్ పార్క్ లో  నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా సోమవారం  ఉదయం ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నగేష్ (25 ఏళ్ళు) మరణించడం బాధాకరం అని సందర్శకులు మండిపడుతున్నారు. ఉదయం ఈ ఉద్యోగి నగేష్ ఎలుగుబంటి బోను వద్ద పరిసరాల్లో క్లీనింగ్ చేస్తుండగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. ఎలుగుబంటి బోనులో ఉందనుకొని అతడు

క్లీనింగ్లు చేస్తుండగా సంఘటన సంభవించినట్టు తెలుస్తోంది. ఎలుగుబంటి బోనుకు వేసి ఉన్న తలుపులు ఎప్పుడు తెరుచుకున్నాయో, ఎవరు తెరిచి ఉంచారో తెలియాల్సి ఉంది. 
జూలో సందర్శకులు అందరూ చూస్తుండగానే ఈ ఎలుగుబంటి ఆ యువకుడి పై దాడి చేయడం జరగడంతో సందర్శకులు భయకంపితులయ్యారు. సంఘటనను గుర్తించిన జు అధికారులు వెంటనే

స్పందించి ఆ ఎలుగుబంటిని బంధించారు. తీవ్ర గాయాల పాలైన ఆ ఉద్యోగి నగేష్ ను ఆసుపత్రికి తరలించగా అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటనతో జూలోని సందర్శకులు అంతా అయోమయానికి గురయ్యారు. 
జూలో సిబ్బంది కి, సందర్శకులకు భద్రత కరువైందని ప్రజలు మండిపడుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి ఆరిలోవ పోలీసులు

దర్యాప్తు చేస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam