DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ ని గెలిపిస్తే జాక్ పాట్ ఆఫర్లు ఇస్తాం: తెలంగాణాలో మోడీ, షాలు 

*పెట్రో ధరలు తగ్గిస్తాం: మోడీ, అయోధ్య ఉచిత దర్శనం: అమిత్ షా*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, నవంబర్ 28, 2023 (డి ఎన్ ఎస్):* దక్షిణాదిలో కాషాయ జండా పాతాలి అని కృతనిశ్చయం తో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు జాక్ పాట్ ఆఫర్లు ప్రకటించారు. దీనికోసమే కేంద్ర బీజేపీ నేతలు,

ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించేసారు. ఒకరు పెట్రో ధరలు తగ్గిస్తామంటే, ఇంకొకరు అయోధ్య రామాలయ దర్శనం ఉచితంగా చేయిస్తామన్నారు. 
గత మూడు రోజులుగా తెలంగాణ ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఆయన తెలంగాణ లో బీజేపీ ని గెలిపించి అధికారం ఇస్తే. .పెట్రో ధరలపై వ్యాట్ తగ్గించి, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు. బీజేపీ

అధికారం లో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగానే ఉన్నాయన్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో దేశంలోనే ఎక్కువ ధరలు ఉన్నాయన్నారు. 

దీనికి మించి కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా తన ప్రచారం లో తెలంగాణాలో అధికారం ఇస్తే. . జనవరి లో ప్రారంభం కానున్న అయోధ్య శ్రీ భవ్యరామ

దేవాలయ దర్శనం ఉచితంగా చేయిస్తామని ప్రకటించారు. 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్, తమిళనాడు బీజేపీ అధ్యక్షులు కె. అన్నామలై లాంటి మహామహులు తెలంగాణ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసారు. 

ఇక చోటామోటా నాయకులైతే గ్రామస్థాయిలో విస్తృతంగా పర్యటించి,

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో ప్రజల్లో నమ్మకం సాధించడం లో సఫలీకృతం అయినట్టుగానే కనపడుతోంది.

గతం లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు చేసిన అవినీతి, అక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతో బీజేపీ నాయకులూ విజయవంతం అయినట్టే తెలుస్తోంది.    
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam