DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమాజాన్ని చూపించేది ఫోటోగ్రఫీ : గంట్ల శ్రీనుబాబు 

విశాఖపట్నం, ఆగస్టు 18, 2018 (DNS Online): సమాజాన్ని చూపించేది ఫోటోగ్రఫీ అని రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత, వైజాగ్‌ జర్నలిస్ట్‌ ఫోరం అధ్యక్షు గంట్ల శ్రీనుబాబు

అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం ప్రొఫెషనల్‌ ఫోటోగ్రాఫర్స్‌, వీడియో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన మెగా ఫోటో

ప్రదర్శన ను అయన ప్రారంభించారు. ఆదివారం ఉదయం నగరంలోని హోటల్‌ బుథిలి పార్క్‌లో ‘మెగా ఫోటో ఎగ్జిబిషన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. à°ˆ

కార్యక్రమానుద్ధేశించి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ సమాజాన్ని ప్రతిభించేలా ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు అనేక ఫోటోగ్రఫీను మన ముందుకు

వుంచుతున్నారన్నారు. ఒక్క ఫోటోతో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించే అవకాశం వుందన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఫోటోగ్రఫీకి ఆదరణ పెరిగిందన్నారు.

టెక్నాలజీ పరంగా అనేక మార్పు చోటుచేసుకోవడం వలన ఇప్పుడు ప్రతిఒక్కరూ ఫోటోగ్రఫీపై ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. à°ˆ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటుచేసిన దాదాపు 200 ఫోటోలు,

ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అక్కడి అభివృద్ధి కూడా తెలియచెబుతూ ప్రదర్శించిన చిత్రాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

 à°«à±‹à°Ÿà±‹à°²à± అత్యద్భుతంగా వున్నాయని కొనియాడారు. వచ్చే నెల రక్తదాన శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మహేష్‌

మట్టా తెలిపారు. à°ˆ కార్యక్రమంలో అసోసియేషన్‌ కార్యదర్శి యం. లోకేష్‌కుమార్‌, వ్యవస్థాపక సభ్యు కలోరమ రాజు, చెల్లా నూకరాజు, భాస్కర్‌తో పాటు వివిధ స్డూడియో

యజమానులు, పెద్దఎత్తున ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #vjf  #vjf press club #president #gantla srinu babu #photography #photography day #hotel budhil park  #photo exhibition

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam