DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పెద్దల స్వార్ధానికి తెలంగాణ బీజేపీ బలిపశువు అయ్యిందా? 

*నేతలు గాలికే పరిమితం కావాలి, తాము మాత్రం ఢిల్లీ ని ఏలాలి*

(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

భాగ్యనగరం / విశాఖపట్నం, డిసెంబర్ 08, 2023: దేశ వ్యాప్తంగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న భారతీయ జనతా పార్టీ అధిష్టానం లో సైతం పదవి దాహం ఫలితంగా తెలంగాణాలో బీజేపీ పూర్తిగా బలిపశువుగా మారింది అనే అభిప్రాయం

విశ్లేషకులు తెలియచేస్తున్నారు. దీనికి ప్రధాన నిదర్శనం ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలే. 

కేంద్రం పెద్దల స్వార్ధానికి తెలంగాణ బీజేపీ తో గేమ్ ఆడినట్టుగా కనపడుతోంది. స్థానిక నేతలు ఎదిగితే జాతీయ స్థాయి లో పోటీ పెరిగే అవకాశం ఉన్నందున, వాళ్ళని తొలినాళ్లలోనే అడ్డుకుంటే. .వాళ్ళు ఎదిగే అవకాశం ఉండదు. ఇదే

బీజేపీ పెద్దలు ఆడిన అతిపెద్ద విషక్రీడ. ప్రజల్లో దూసుకుపోతున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని నిలువరించగలిగితే వీళ్ళు కేంద్రం స్థాయికి చేరుకునే అవకాశం ఉండదు. ఎమ్మెల్యే ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని తొలగించి, ఏమాత్రం ప్రజాదరణ లేని కిషెన్ రెడ్డి ని పదవిలో కూర్చోబెట్టారు. శాసన సభ ఎన్నికలు

పూర్తి అయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన బీజేపీ పూర్తిగా చతికిల బడి, వెంటిలేటర్ పైకి వెళ్ళింది. 

అయితే మరో 5 నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగవలసి ఉంది. ఇప్పుడు తిరిగి బండి సంజయ్ ని అధ్యక్షునిగా నియమించడం జరుగుతోంది. అంటే. .బండి సంజయ్ ప్రభావంతో ఎంపీ సీట్లు ఎక్కువ గెలుచుకుంటే. .తిరిగి మోడీ ప్రధానిగా

ఎన్నిక అయ్యే అవకాశం ఉంటుంది. కేవలం ఈ ఎంపీ సీట్ల కోసమే తెలంగాణాలో బీజేపీ అధ్యక్షున్ని మార్చి, ఎన్నికల్లో అందరినీ ఓడించి, గల్లీ స్థాయికి పరిమితం చేయడం, ఎంపీలు గెలిస్తే కేంద్రం లో తాము సురక్షితంగా ఉండడం కోసం పెద్దలు ఆడిన పెద్ద గేమ్ లో విజయవంతం అయ్యారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   

ఆరు నెలల

క్రితం వరకూ తెలంగాణాలో బీజేపీ మంచి ఊపు మీద ఉండేది. బండి సంజయ్ కుమార్ పార్టీ అధ్యక్షునిగా ఉండగా గ్రామస్థాయి లో ప్రజల్లో బీజేపీ పట్ల భారీ ఎత్తున స్పందన పెరిగింది. బండి నాయకత్వంలో శాసన సభ ఎన్నికల్లో పాల్గొన్నట్టయితే కచ్చితంగా బీజేపీ కి ఎక్కువ సీట్లు గెలుచుకునేది అనే నమ్మకం, అభిప్రాయం కలిగింది. సరిగ్గా ఇదే క్రమంలో

బండి ని పదవి నుంచి తొలగించి జి. కిషెన్ రెడ్డి ని అధ్యక్షునిగా నియమించడం అనే అతి పెద్ద తప్పు చేసేసింది. ఇదే బీజేపీ అధిష్టానం చేసిన అతిపెద్ద తప్పిదం. దీని ఫలితంగా తెలంగాణ ఎన్నికల్లో కేవలం 8 మంది బీజేపీ అభ్యర్థులు మాత్రమే గెలవగలిగింది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, సీఎం అభ్యర్థి ఈటెల రాజేందర్ వంటి

అగ్రనేతలు సైతం పెద్దగా పోరాటం చేయలేకపోయారు. అది కూడా ముప్పుతిప్పలు పెట్టారు. కేవలం అభ్యర్థుల సొంత బలంతోనే గెలిచారు తప్ప, బీజేపీ కేంద్ర నేతల ప్రచార ప్రభావం లేదు అని అందరికి తెలిసిపోయింది.   

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam