DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజెఎఫ్ ప్రెస్ క్లబ్ కార్యదర్శత ఎవరిది ? నాగరాజా లేక రవికాంతా? 

*ఎన్నికల్లో జోరందుకున్న ప్రచార మంత్రాంగాలు రసవత్తర సన్నివేశాలు*  

*(DNS Report: Ganesh Reddy BVS, Visakhapatnam)*

*విశాఖ పట్నం, డిసెంబర్ 15, 2023 (డి ఎన్ ఎస్):* దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఖ్యాతిగాంచిన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ (విజెఎఫ్ ) ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ప్రచార పర్వం జోరందుకుంది. సుమారు

దశాబ్ద కాలం తర్వాత జరుగుతున్నా ఈ ఎన్నికల్లో కీలకమైన పదవి ప్రధాన కార్యదర్శి. ఈ పదవి కోసం ఇద్దరు హేమాహేమీలు తలపడుతున్నారు. ఒకరు పూర్వ ఉపాధ్యక్షులు, తాత్కాలిక కార్యదర్శి ఆర్. నాగరాజు పట్నాయక్ (( సీనియర్ జర్నలిస్ట్, విశ్వచిత్రకళ ) కాగా, మరొకరు గత కమిటీ పై గళమెత్తి, విస్తృత పోరాటం చేసిన బృందం ప్రతినిధి బి. రవికాంత్ ( బ్యూరో

చీఫ్, విజన్ ). ఇద్దరూ ఇద్దరే. సుమారు రెండు దశాబ్దాల కాలం పైగా పత్రికారంగంలో కొనసాగుతూ అందరికి సుపరిచితులు కావడం గమనార్హం. 

అందరు అభ్యర్థుల మధ్య స్నేహ భావం ఉన్నప్పడికి ఎన్నికల అంశం లో ఢీ అంటే ఢీ అంటున్నారు. సభ్యులు సైతం ఆచితూచి స్పందిస్తూ ఎవ్వరిని తిరస్కరించలేక, పరిస్థితులను బేరీజు వేసుకునే పనిలో

ఉన్నారు. 

ప్రచార పర్వం జోరందుకుంది. అధ్యక్ష స్థానం తర్వాత అదే స్థాయిలో ప్రాధాన్యత కల్గిన హోదా కావడం, జాతీయ స్థాయిలో విశాఖపట్నం ప్రెస్ క్లబ్ కి ఒక ఉన్నతమైన గుర్తింపు ఉండడంతో గెలుపు కోసం హోరాహోరీ పోరాడుతున్నారు. ఈ పోటీ కేవలం ఎన్నిక వరకే అని ఇరువర్గాలు ప్రకటించడం గమనార్హం. 

విజెఎఫ్ ప్రెస్ క్లబ్

కు తిరిగి పూర్వ వైభవాన్ని కల్పించేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తామని ఇద్దరూ ప్రకటిస్తున్నారు. 

ఈ నెల 22 న జరుగుతున్న వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ ఎన్నికల్లో హేమాహేమీలు హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా వివిధ కారణాలవల్ల వాయిదా పడుతూవస్తున్న ఈ ఎన్నికలు ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ జోక్యంతో

జరుగుతున్నాయి. కోర్టు కేసులు, వివిధ వర్గాల మధ్య అభిప్రాయభేదాలు అనంతరం ఒక శాంతియుత పరిష్కారం చూపించేందుకు, జిల్లా యంత్రాంగం అవిశ్రాంతంగా కృషి చేసింది. 

ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ముగ్గురు బరిలో ఉన్నారు. పూర్వ అధ్యక్షులు గంట్ల శ్రీను బాబు (ఆంధ్రప్రభ  బ్యూరో చీఫ్), ఆర్ రామచంద్రరావు ( సాక్షి టీవీ ప్రత్యేక

ప్రతినిధి),ఎం.ఆర్.ఎన్. వర్మ ( సీనియర్ పాత్రికీయులు) పోటీపడుతుండగా. .ఇతర పదవులకోసం 

ఒక ఉపాధ్యక్ష పదవికి ఆరుగురు పోటీ పడుతున్నారు. 

ఒక సంయుక్త కార్యదర్శి పదవికి 8 మంది పోటీ పడుతున్నారు. 

ఒక కోశాధికారి  పదవికి ఆరుగురు పోటీ పడుతున్నారు. 

కార్యవర్గ సభ్యులుగా 6 పోస్టులకు గాను 27

మంది పోటీ పడుతున్నారు. 

ఈ ఎన్నిక ఈ నెల 22 న విశాఖపట్నం డాబాగార్డెన్స్ లోని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ కార్యాలయంలోనే జరుగనున్నాయి. ఎన్నిక అనంతరం కౌంటింగ్, తదుపరి ఎన్నిక ఫలితాలను ప్రకటించనున్నారు.  ప్రస్తుతం ఈ క్లబ్ జిల్లా యంత్రాంగం పరిధిలో నిర్వహించబడుతోంది. నూతన కమిటీ ఎన్నిక ఫలితాల తదుపరి, వారికి క్లబ్

నిర్వహణ భాద్యతలు అప్పగించనున్నట్టు జిల్లా యంత్రాంగం తెలిపింది. 

ఈ ఎన్నిక నిర్వహణ భాద్యతలను సీనియర్ పాత్రికీయులు, ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు బి. ప్రభాకరక శర్మ కు అప్పగించారు.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam