DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ మాట నిలబెట్టుకుంది. ఇక జనమే మాట నిలబెట్టుకోవాలి

*రామ మందిరం వచ్చింది. .మనం ఓటు వేస్తె రామరాజ్యం కూడా వస్తుంది*

*రెండు చోట్ల బీజేపీ అధికారంలో ఉంది కాబట్టే మందిరం వచ్చింది.* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖ పట్నం, జనవరి 22, 2024 (డి ఎన్ ఎస్):* 500 ఏళ్ళ పాటు హిందువులు అవిశ్రాంత పోరాటం చేసి సాధించిన రామ మందిరం నిర్మాణం పూర్తి

అయ్యింది. సోమవారం ఆలయ ప్రారంభోత్సవం కూడా జరుగుతోంది. బీజేపీ ఎన్నికల హామీ రామ మందిరం నిర్మించి చూపించింది. ఇక జనం ఇచ్చిన మాట బీజేపీ కి ఓటు వేసి నిలబెట్టుకోవాలి. ఇదే మాట సర్వత్రా వినిపిస్తోంది. 

గత నాలుగు దశాబ్దాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేస్తామని  హామీతో ఎన్నికల ప్రచారం

చేసి, ప్రతిపక్షాల చేత, ప్రజల చేత ఎన్నో అవమానాలకు సైతం గురైంది. ఆఖరికి అధికారాన్ని కూడా కోల్పోవలసి వచ్చింది.  

గత కొన్నేళ్లుగా ప్రజా క్షేత్రంలో ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీ నేడు తన మాట నిలబెట్టుకుంది. నేడు బాల రాముని ప్రాణ ప్రతిష్ట కూడా జరుగుతోంది. ఇప్పుడు ప్రజలు తమ మాట నిలబెట్టుకోవాల్సి

ఉంది. 

రాముడి మందిరం ఏర్పడింది. ఇక ఏర్పడవలసింది రామ రాజ్య ఆవిర్భావమే. 

భారత్ ను దోచుకోడానికి వచ్చిన ముఘల్ సైన్యం అయోధ్య లోని రామ జన్మభూమి లోని ఆలయాన్ని కూల్చేసి, ఒక మసీదు కట్టడం తో ప్రారంభమైన హిందూ పోరాటం 2023 లో సుప్రీం కోర్టు తీర్పు తో ముగిసింది. ఈ పోరాటంలో లక్షలాది మంది హిందువులు ప్రత్యక్షంగా

పాల్గొన్నారు. వేలాదిమంది కరసేవకులు ప్రాణత్యాగాలను సైతం చేయడం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1946 లో ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చినప్పడికి నాటి కుహనా నేతల స్వార్థం వల్ల వివాదం మరింత ముదిరిపోయింది. దాంతో 1990 లో ఒకసారి 1992 లో రెండవసారి వేలాదిమంది కరసేవకులు రామ జన్మభూమి లో అక్రమంగా కట్టిన   
 మసీదును

కూల్చేదుందుకు ప్రత్యక్ష పోరాటం చేసి కూల్చేశారు. పోలీసుల కర్కశ  కాల్పుల్లో ఎందరో మరణించారు. వాళ్ళ శరీరాలు కూడా దొరకకుండా చేసేశారన్నది కరసేవకుల ప్రకటన. 

ఉద్యమానికి శ్రీకారం చుట్టింది అద్వానీ యే . .

రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా లాల్ కిషన్ అధ్వాని దేశ వ్యాప్తంగా రాధా యాత్ర చేపట్టారు. వారికి

సహాయంగా తెలంగాణ కు చెందిన టైగర్ అలె నరేంద్ర నిలబడ్డారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రామ జన్మభూమి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే మొదటి పేరు నరేంద్ర. నాటి పోరాట యోధులు ఈ శుభవార్త వినకుండానే వెళ్లిపోవడం కొంత లోటు  .

దేశాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా సోమవారం జనం ఎంతో వైభవాన్ని చవిచూశారు. కేవలం ఇది బీజేపీ తో

మాత్రమే సాధ్యమయ్యింది. అనేది అక్షర సత్యం. రామ మందిరం నిర్మాణం కోసం కోర్టు తీర్పు ఇచ్చినా. . .ఇటు కేంద్రం లోనూ, అటు ఉత్తర ప్రదేశ్ లోనూ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టే రామ మందిరం తయారయ్యింది. లేని పక్షంలో కచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్మాణానికి పునాది కూడా వెయ్యనిచ్చేవి కావు అన్నది అందరి అభిప్రాయం.      

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam