DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి గణతంత్ర వేడుకలు:  పూడిపెద్ది శర్మకు ఆధ్యాత్మిక పురస్కారం

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, జనవరి 26, 2024 (డి ఎన్ ఎస్):* ఆధ్యాత్మిక రంగం లో విస్తృత సేవలు అందిస్తున్న పూడిపెద్ది శర్మ ను సింహాచలం దేవస్థానం సేవా పురస్కారంతో సత్కరించింది. శుక్రవారం శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం లో జరిగిన 75 వ రణతంత్ర వేడుకల్లో ఆలయ ఈఓ శ్రీనివాస్ మూర్తి ఈ

పురస్కారాన్ని అందించారు. విశ్వ హిందూ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ మఠ్ మందిర్ టోలి గా సేవలు అందిస్తున్న శర్మ ఆలయ పరిసరాల్లో హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించేలా కృషి చేస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో ఆలయ సిబ్బందికి సూచనలు చేస్తూ ఆలయ వైభవాన్ని పెంపొందించేలా సూచనలు చేస్తున్నారు. ఆధ్యాత్మిక సేవ సంఘాలకు సన్మానించే

కార్యక్రమంలో భాగంగా, అత్యున్నత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ధార్మిక సంఘాలు, సేవా సంఘాలు, ట్రస్టులు, ఉన్నత ఉత్తమ సేవా కార్యక్రమ నిర్వహించే కార్యకర్తలను గౌరవించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్బంగా శర్మ ను ఈఓ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు  గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేష్, తదితరులు అభినందించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam