DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాళ్ళు 70 యేళ్లు వయసు దాటినా అదే జోరు.. హుషారు 

 *హుషారుగా విశాఖ లో కెవి విశ్రాంత టీచర్ల ఆత్మీయ సమావేశం* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, జనవరి 26, 2024:* విశ్రాంతి తీసుకునే వయసు అంటూ రిటైర్ మెంట్ ఇచ్చినా.. 70 యేళ్లు దాటినా.. వాళ్ళల్లో అదే జోరు హుషారు తగ్గలేదు అని కేవి టీచర్లు నిరూపించారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ విశ్రాంత ఉద్యోగుల

సంఘం, విశాఖ యూనిట్ ఆత్మీయ సమ్మేళనం విశాఖలో శుక్రవారం ముడసర్లోవ లో జరిగింది. ఈ సమావేశంలో 70 ఏళ్ల వయస్సు దాటిన 21 మంది విశ్రాంత అధ్యాపకులు, సిబ్బంది కి సంఘం జిల్లా అధ్యక్షులు బి. సత్యనారాయణ, కార్యదర్శి వైవి గోవిందాచార్యులు సారథ్యంలో ఆత్మీయ సత్కారం చేశారు. 

సమాన గ్రహీతల్లో పూర్వ డిప్యూటీ కమిషనర్ ఏ వి ఎల్ కే

రావ్,  పూర్వ సహాయ కమిషనర్ ఏ. పద్మావతి, విశ్రాంత ప్రిన్సిపల్స్ ఎం వి అర్ ఎస్ ఎస్ వి ఎల్ ఎన్ శాస్త్రి, డా. సివి నరసింహం తదితరులు ఉన్నారు. 

ఈ సందర్భంగా వీరంతా గత స్మృతులను నెమరు వేసుకున్నారు. నాటి సంఘటనలను వివరిస్తూ ఆనందాన్ని పొందారు. విశ్రాంత సంగీత అధ్యాపకులు మణిప్రభ నిర్వహణలో సాంస్కృతిక కార్యక్రమాలు

జరిగాయి.

కార్యక్రమం లో సంఘం జిల్లా అధ్యక్షులు బి. సత్యనారాయణ, కార్యదర్శి వైవి గోవిందాచార్యులు కార్యక్రమం నిర్వహణ చేపట్టారు.విశ్రాంత పి ఈ టీ కే. సత్యం ఆరోగ్య సూత్రాలు తెలియ చేశారు. కార్యక్రమం లో సుమారు 80 మంది సభ్యులు పాల్గొన్నారు.  కార్యక్రమాల నిర్వహణను జి. వేణు గోపాల్ రావ్ చేపట్టారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam