DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రహ్మజ్ఞాని పీవీ కి భారత రత్నఇవ్వడం అందరికి గర్వకారణం 

*పూర్వ ప్రధానికి విశాఖ లో ప్రముఖుల ఘన నివాళి*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

విశాఖపట్నం, ఫిబ్రవరి 11, 2024: (డి ఎన్ ఎస్):* దేశం మెచ్చిన, విశ్వం దర్శించిన బ్రహ్మజ్ఞాని, పూర్వ ప్రధాని పివి నరసింహరావు కు భారత రత్న పురస్కారం లభించడం దేశ ప్రజలందరికి గర్వకారణం అని సెంచురియాన్  యూనివర్సిటీ వీసీ డా. జి

ఎస్ ఎన్  రాజూ అన్నారు. పీవీకి భారత రత్న ప్రకటించిన  సందర్బంగా వైజాగ్ బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహణలో అయన స్మృత్యర్థం ఆదివారం విశాఖ లో పలు కారక్రమాలు  నిర్వహించారు. దీనిలో భాగంగా విశాఖ లోని గవర్నర్ బంగ్లా వద్ద పివి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. 

ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ

అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రధాని భాద్యతలు చేపట్టి దేశాన్ని అగ్రస్థానంలో నిలిపారన్నారు. ఆర్థిక సంస్కరణలకు మూల బీజం వేసిన వ్యక్తి పివి అన్నారు. వారు దేశానికి చేసిన సేవలను గౌరవిస్తూ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యధి పార్టీ అయినప్పడికి భారత రత్న పురస్కారం పివి కి అందించడం మహోన్నతం

అన్నారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర ఉపాద్యక్షులు ద్రోణంరాజు శ్రీ వాత్సవ్ మాట్లాడుతూ తమ తాత ద్రోణంరాజు సత్యనారాయణ కు పివి తో సన్నిహిత బంధం ఉందని, పలు సార్లు వారిని కలిసే అవకాశం లభించిందన్నారు. పివి మరణానంతరం దేశ మొత్తం మీద, మొట్టమొదటి విగ్రహం విశాఖ లోనే తమ తండ్రి ద్రోణంరాజు శ్రీనివాస్

ఏర్పాటు చేశారన్నారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సుహాసిని ఆనంద్ మాట్లాడుతూ ఒక దక్షిణ భారత ప్రాంత వ్యక్తి అందునా తెలుగు వాళ్ళు ప్రధానమంత్రి గా పదవి చేపట్టిన ఘనత కేవలం పివి కె దక్కిందన్నారు. ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టి, దేశాన్ని అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థితికి చేర్చిన మహనీయులు పీవీ

అన్నారు. 

బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కలిగట్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి, హోమ్ శాఖా మంత్రి గా తదుపరి భారత ప్రధానిగా పెంతో ఉన్నత సేవలు అందించారన్నారు. విదేశాల్లో తాకట్టు లో ఉన్న బంగారాన్ని

విడిపించడం ద్వారా ఆర్థిక నిల్వలను పరిరక్షించారన్నారు.  

ఎయు విశ్రాంత ప్రిన్సిపాల్  డా. పీఎస్ అవధాని, మాట్లాడుతూ ఆర్థిక, రాజకీయ రంగం తో పాటు వారికి సాహిత్య రంగంలోనూ ఏంటో ప్రతిభ ఉందన్నారు. విశ్వనాధ సత్యనారాయణ రచించిన వేయి పడగలు గ్రంధాన్ని పివి సహస్ర ఫణ్ పేరిట హిందీ లో అనువదించడం తో వీరి ఖ్యాతి దేశం లో

 మారుమ్రోగిపోయిందన్నారు.  

వైజాగ్ బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు టి ఎస్ ఆర్ ప్రసాద్, మాట్లాడుతూ పివి గౌరవార్ధం ప్రముఖులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ,  

ఈ కార్యక్రమం లో విశాఖ ఆర్ ఎస్ ఎస్ ప్రముఖ్ పివి నారాయణ రావు,  విప్రోత్సవమ్ కన్వీనర్ పివి నారాయణ, ఆకెళ్ళ

రమణమూర్తి, నండూరి సుబ్రహ్మణ్యం, శాయిరామ్, కోటేశ్వర రావు,  శంకర్ నీలు, చిన్న శ్రీను, తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam