DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లోక్ సభ సీటు కై నుంచి సుజనా కోసం పట్టుపట్టిన పురందేశ్వరి?

*హస్తిన లో చక్రం త్రిప్పిన పురంధేశ్వరి.. లెక్కలు తారుమారు*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

విశాఖపట్నం, ఫిబ్రవరి 16, 2024 : (డి ఎన్ ఎస్):*బీజేపీ అధిష్టానం తో ఢిల్లీ లో జరుగుతున్న చర్చల్లో దగ్గుబాటి పురందేశ్వరి చక్రం త్రిప్పుతున్నారు. విశాఖ నుంచి సుజనా చౌదరి ని బరిలోకి దింపేందుకు పూర్తిస్థాయి లో పట్టు

పట్టినట్టు తెలుస్తోంది. గత రెండేళ్లుగా విస్తృత ప్రచారం చేస్తున్న రాజ్య సభ సభ్యులు జివిఎల్ నరసింహారావు పేరు పరిశీలనలోకి లేకపోవడంతో కేంద్రం అధిష్టానం ప్రశ్నించినట్టు సమాచారం. ఒక సామాజిక వర్గం లాబీ తీవ్ర ఒత్తిడి పెట్టడం తో విశాఖ, రాజమండ్రి, హిందూపురం సీట్ల లో తమ వర్గం పేర్లు ఖరారు చెయ్యాలని హస్తినలో తిష్టవేయడం

జరిగింది. 

ఇదే లెక్కలు ఖరారు జరిగితే, కేంద్ర బీజేపీ అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న జివిఎల్ కు మరోసారి రాజ్య సభ టికెట్ ఖరారు చేసే అవకాశమూ లేకపోలేదు.

విస్తృతంగా గత రెండేళ్లుగా విశాఖ పార్లమెంట్ నియోజక వర్గంలో అన్ని వర్గాల తోనూ సమావేశాలు జరిపి, ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నం చేసారు. కేంద్ర

మంత్రులను విశాఖ తీసుకు వచ్చి, అభివృద్ధి పై దృష్టి సారించేలా ఎన్నో చర్యలు చేసుకున్న ఘనత జివిఎల్ దే. 
పొత్తుల్లో భాగంగా సమీకరణాలు మారితే. .అభ్యర్థులు సైతం మారె అవకాశం ఉంది అనే విషయం ఒక ప్రైవేట్ సమావేశం లో బీజేపీ వర్గాలు ముందుగానే తెలియచేశాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam