DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ ని కులపార్టీగా మార్చేశారు: మండిపడుతున్నసీనియర్ క్యాడర్

*సిట్టింగ్ ఎంపీకి సీటు లేదు, 6 ఓట్లే వచ్చిన వ్యక్తికి ఎమ్మెల్యే నా ?*  

*(Report:Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 30, 2024 (డి ఎన్ ఎస్):* దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను  బెంబేలేత్తిస్తున్న బీజేపీ ని ఆంధ్రలో మాత్రం ఒక కుల పార్టీగా మార్చేశారని సీనియర్ క్యాడర్ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఏపీ

 ఎన్నికల్లో సీట్లు కేటాయించిన వాళ్లలో భర్తో, భార్యో ఒక సామాజిక వర్గానికి  చెందిన వాళ్ళేనని తెలియచేస్తున్నారు. 
6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. వీళ్లల్లో ఎక్కువమంది ఒకే సామాజిక వర్గానికి చెందిన పరిధి కావడం గమనార్హం. పైగా జిల్లాలతో ఏమాత్రం పరిచయం లేని వాళ్ళని

అభ్యర్థులుగా ప్రకటించడం వివాదంగా మారింది. దానికితోడు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలనుంచి ఈ పార్టీల నుంచి వచ్చి చేరిన వారే కావడం తెలిసిందే. దీంతో దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు సొంత ఆలోచనలో పడ్డారు. ఇంతకాలం హిందుత్వ సిద్ధాంతం కోసం పనిచేసిన బీజేపీ నేడు ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాయడం తో కుల

పార్టీగా మారింది అనే భావనకు వచ్చేసారు. తాము నమ్మిన హిందుత్వ పార్టీ గాడి తప్పడంతో మనసాక్షి ని చంపుకుని నేటి కుల పార్టీ కోసం పనిచెయ్యలా లేక ఇంటికే పరిమితం కావాలా అనే ఆలోచనలో పడ్డారు. 
ఇప్పుడున్న రాష్ట్ర నాయకుల్లో హిందుత్వ సిద్ధాంతాలు ఉన్నవాళ్ళని కాగడాలు పెట్టి వెతికిన కనిపెట్టడం  కష్టమే. 
నరేంద్ర మోడీ

చరిష్మా దేశ, విదేశాల్లో మారుమ్రోగిపోతుంటే. . ఆంధ్ర లో మాత్రం ఈ కుల కూటమి పార్టీని బ్రష్టు పట్టించేసారు అనే భావన సాధారణ కార్యకర్తల్లో కూడా వచ్చేసింది. దీనికి నిదర్శనమే రాష్ట్ర కమిటీలోనూ, జిల్లా కమిటీల్లోనూ ఎక్కువమంది ఆ సామాజిక వర్గమే కనపడడం. .
ఈ రాష్ట్రాన్ని కేంద్ర అధిష్టానం ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ ని ప్రక్షాళన

చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే డిమాండ్ వస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam