DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవినీతి అనకొండ అయ్యన్నా సన్యాసానికి సిద్ధం కండి : వైకాపా 

విశాఖపట్నం :  à°†à°—స్టు 20, 2018 (DNS Online): అవినీతి అనకొండ à°—à°¾ తయారైన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి అయ్యన్న పాత్రుడు ను రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని

 à°µà±ˆà°¸à±€à°ªà±€ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌ రెడ్డి ఆరోపించారు. మద్దిలపాలెంలో à°—à°² వైసీపీ కార్యాయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన

మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడు అవినీతి చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీ పడుతున్నారని, 
తమ పార్టీ అధినేత జగన్‌ చేసిన వ్యాఖ్యల పై అయ్యన్న తన సభ్యత,

సంస్కారాన్ని మరిచి వ్యక్తిగత దూషణలు చేసే స్థాయికి దిగజారడం శోచనీయమన్నారు. తాను అవినీతి చేసానని నిరూపిస్తే రాజీనామా చేస్తానని అయ్యన్న అన్నారని, ఆ మాటకి

కట్టుబడి రాజకీయ సన్యాసం చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అయ్యన్న పెద్ద అవినీతి పరుడని, గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నారని, గనులన్నీ దోచుకుతింటున్నారని

స్వయంగా జిల్లాకు చెందిన మంత్రి గంటాయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయలేదా అని ప్రశ్నించారు. ఆ సమయంలో మంత్రి గంటా ఓ దొంగని, విశాఖ దోచుకుతింటున్నారని

సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే చెప్పలేదా అని అయ్యన్నను ప్రశ్నించారు. ప్రజలు చెప్పిన వాస్తవ పరిస్థితులనే జగన్‌ బహిరంగ సభలో చెప్పారన్నారు. నాలుగు

సంవత్సరాలుగా నర్సీపట్నం నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేసారని ప్రశ్నించారు. ఏ రోజైనా జిల్లా మంత్రిగా గిరిజన ప్రాంతంలో పర్యటించి, విష జ్వరాలతో బాధపడుతున్న

వారిని పరామర్శించారా అని అన్నారు. జిల్లా లొ విశాఖను కలుషితం చేస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే వెలగపూడితో కలిసి కోడి పందాలను, గుర్రపు పందాలను, జూదం  à°µà°‚à°Ÿà°¿

వాటిని ప్రోత్సహించి విశాఖ సంస్క్రృతి ని కలుషితం చేస్తున్నారన్నారు. మంత్రి అయ్యన్న రాజకీయ సన్యాసం తీసుకోవల్సిన అవసరం లేదని, ప్రజలే ఆయనను సాగనంపుతారని

జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలో టీడీపీ తుడిచిపెట్టుకు పోతుందని అన్నారు. సభ్యత, సంస్కారంతో మంత్రి అయ్యన్న మాట్లాడితే బాగుంటుందని

అన్నారు. వైసీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు మాట్లాడుతూ జగన్‌ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు విశేష ఆదరణ లభిస్తోందన్నారు. జగన్‌ చేపట్టిన

పాదయాత్రలో ప్రజలు తమ సమస్యపై వినతి పత్రాలు అందిస్తున్నారని అన్నారు. ప్రజల దగ్గర నుంచి ఏవైతే విషయాలు  à°¤à±€à°¸à±à°•à±à°¨à±à°¨à°¾à°°à±‹, ప్రజలు  à°à°µà±ˆà°¤à±‡ మనోభావాలను వెల్లడి పరచారో

వాటినే నర్సీపట్నం బహిరంగ సభలో జగన్‌ ప్రస్తావించారన్నారు. మంత్రి అయ్యన్న తనని ప్రశ్నించుకోవాలని, జగన్‌ మాట్లాడిన వాటిలో ఏమైనా అవాస్తవాలు ఉంటే లిఖిత

పూర్వకంగా ఇవ్వగలరా అని అయ్యన్నను ప్రశ్నించారు. ప్రజలు తెలిపిన విషయాలను, ప్రజా సమస్యలపై అయ్యన్నను ప్రశ్నించారే తప్ప, వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శులు

చేయలేదన్నారు. కాని అయ్యన్న తన స్థాయిని మరిచి వ్యక్తిగత విమర్శలు  à°šà±‡à°¶à°¾à°°à°¨à±à°¨à°¾à°°à±. వాస్తవాలు మాట్లాడితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని అయ్యన్నను ప్రశ్నించారు. à°ˆ

విలేకరు సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, ఎస్‌.చంద్రమౌళి, అనుబంధ విభాగం అధ్యక్షు పీలా వెంకటక్ష్మి, à°—à°°à°¿à°•à°¿à°¨ గౌరి, బి.శ్యామ్‌కుమార్‌ రెడ్డి,

బి.కాంతారావు, à°Ÿà°¿.సురేష్‌, బర్కత్‌ ఆలీ, బోని శివరామకృష్ణ, రాధ, వాసు, ఆనంద, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి రవికుమార్‌, రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి

యువశ్రీ, నగర కార్యదర్శి పీత మహేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dnsmedia  #dns live  #dns media  #vizag  #visakhapatnam  #ayyanna patrudu  #minister  #andhra pradesh government  #ysr congress  #koyya prasad reddy

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam