DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రతి పండుగనూ పర్యావరణ హితంగానే జరుపుకుందాం : ఎస్. విజయ్ కుమార్ 

విశాఖపట్నం, ఆగస్టు 21, 2018 (DNS Online): ప్రతి పండుగ, పర్వదినోత్సవాన్ని పర్యావరణ హితంగానే సమ్మిళితం చేసి జరుపుకుందామని ప్రముఖ పారిరిశ్రామికవేత్త ఎస్. విజయ్ కుమార్

పిలుపునిచ్చారు. మంగళవారం నగరం లోని ద్వారకానగర్ లో గల పౌరగ్రంధాలయం లో పర్యావరణ మార్గదర్శి వైశాఖి ఆధ్వర్యవంలో " విత్తనాలతో రాఖీ పండుగ " అవగాహనా కార్యక్రమం

కు  à°…యన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు లోనుకాకుండా, పర్యావరణాన్ని కాపాడుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని మొక్కల

సంబంధితంగా జరుపుకోవాలని కోరారు. పర్యావరణం పై ప్రజల్లో అవగాహనా కల్పిస్తున్న యువతీ యువకులు ఈ పర్యాయం రాఖీ పండుగను సైతం విత్తనాలతో తయారు చేసి నగర వాసులకు

అందిస్తున్నారన్నారు. పండుగ తర్వాత వీటిని నాటడం ద్వారా మొక్కలు పెంచవచ్చు అనే సంకల్పం తో యువత వినూత్న తరహా ప్రక్రియకు శ్రీకారం చేపట్టారన్నారు. వీరికి

సహకారం అందించవలసిన అవసరం ఉందన్నారు. బంధాలు- అనుబంధాలను పర్యావరణం తో సమ్మిళితం చేస్తే అవి విడుదల చేసే మంచి గాలి, ఆక్సిజన్ వలన ప్రజలకు మంచి ఆరోగ్యం

కలుగుతుందన్నారు. ఇతర వివరాలకై  8897472088 , 7382420996 , 7207835806   నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు. à°ˆ కార్యక్రమం లో పాల్గొనదలచినవారు తమ పేర్లను ఎస్ à°Žà°‚ ఎస్ ద్వారా పంపాలని కోరారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam