DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లఘు నాటికల ద్వారా ప్రభుత్వ పధకాలను గ్రామాల్లో ప్రదర్శించాలి : జెసి 2  సిరి 

విశాఖపట్నం, ఆగస్టు 21, 2018 (DNS Online): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పధకాలను వివిధ కళా రూపాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్గించాలని జిల్లా సంయుక్త

కలెక్టర్ 2 డాక్టర్ సిరి పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఆంధ్ర ప్రదేశ్ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యవంలో నిర్వహించిన

గ్రామదర్శిని కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కళాకారులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలకు

అందిస్తున్న సంక్షేమ పధకాలను ప్రజలకు అందించే విధంగా వీధి నాటికలు, గ్రామ స్థాయిలో రచ్చబండ ప్రదర్శనల ద్వారా అందరికీ తెలియచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర

స్థాయిలో జరిగే శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొని, శిక్షణ పొందిన వారి ద్వారా మరిన్ని మెరుగైన విధానాలు తెలుసుకుని గ్రామా స్థాయిలో ప్రజలను చైతన్య పరచాలని

కోరారు. క్షేత్ర స్థాయిలో కొంత మందికి ఈ పథకాలపై తగినంత అవగాహన లేకపోవడం వల్ల సక్రమంగా సద్వినియోగం చేసుకోలేపోతున్నారన్నారు. ఈ సమస్యను అదిగమించేందుకై,

క్షేత్ర స్థాయిలో కళాబృందాల ద్వారా ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకై జిల్లాకు 49 కళాబృందాలను ప్రభుత్వం

కేటాయించిందన్నారు. జిల్లాలోని 39 మండలాలు, మూడు మున్సిఫాలిటీలు, జి.వి.ఎం.సి.లోని 7 జోన్లకు ఒక్కొక్క బృందం చొప్పున మొత్తం 49 కళాబృందాలను కేటాయించామన్నారు. ఆయా

బృందాలు ప్రస్తుతం వారానికి రెండు రోజులు పాటు గురువారం, శుక్రవారం జరుగుచున్న గ్రామదర్శిని-నగర దర్శిని కార్యక్రమాల్లో ప్రజలను ఆకర్షించే విదంగా

కళాప్రదర్శనలను ఇవ్వాలని కళాబృందాలను ఆమె కోరారు. ఈ ఏడాది డిశంబరు మాసాంతం వరకూ కళాబృందాలు ఈ ప్రదర్శనలు ఇవ్వాలని ఆమె సూచించారు.

 

విశిష్ట అతిధిగా

పాల్గొన్న రాష్ట్ర సమాచార శాఖ డిప్యూటీ డైరక్టర్ మణిరామ్ మాట్లాడుతూ జిల్లా ష్ఠాయిలో ఎంపిక కాబడిన పలువురు కళాకారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు

అందిస్తున్నామని, వాటిలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వ పధకాలను ప్రతి గురు, శుక్రవారాల్లో జరిగే గ్రామ దర్శిని కార్యక్రమాల్లో శిక్షణ పొందిన కళాకారులూ ప్రభుత్వ

పథకాలపై లఘు నాటికల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు.

మండలాలు, మున్సిఫాలిటీలు, జోన్ల వారీగా కేటాయించి కళాబృందాలు ఈ వారం నుండే తమ కళా ప్రదర్శనలు

ఇచ్చేందుకు సిద్దంకావాలన్నారు. గురు,శుక్రవారాల్లో రోజుకి రెండు ప్రదర్శనల చొప్పున వారానికి నాలుగు ప్రదర్శనలు ఇవ్వాలని కళాబృందాలకు ఆయన సూచించారు.

కళాప్రదర్శనలు ఇచ్చినట్లుగా మండల స్థాయి అధికారుల నుండి దృవీకరణ పత్రాని పొందాలన్నారు. 
 à°ˆ కార్యక్రమం లో జిల్లా నుంచి ఎంపిక చేయబడిన పలువురు కళాకారులూ

పాల్గొన్నారు.  
జిల్లా పర్యాటక శాఖ అధికారి పూర్ణిమాదేవి, అదనపు పౌర సంబంధాల అధికారి కె.రామకృష్ణ, ఏ.వి.సూపర్‌వైజర్ ఐ.శ్రీనివాసరావు తదితరులతో 49 కళాబృందాలకు

చెందిన కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

#dns  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #dnslive  #dns live  #vizag  #visakhapatnam #joint collector  #jc2  #grama darshini  #welfare schemes

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam