DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కచ్చితమైన ఓటరు జాబితా సిద్దం చేయాలి : సి ఈ ఓ సిసోడియా 

విశాఖపట్నం, ఆగస్టు 23 , 2018 (DNS Online ):  à°•à°šà±à°šà°¿à°¤à°®à±ˆà°¨ ఓటరు జాబితాను రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్.పి.సిసోడియా ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం విశాఖ జిల్లా

కలక్టర్ కార్యాలయపు సమావేశమందిరంలో పెందుర్తి అసెంబ్లి నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి ఎ ఇ ఆర్ ఓ లు, ఎన్నికల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా

ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా సక్రమంగా సిద్దం చేయాలని స్పష్టం చేసారు. పెందుర్తి నియోజక వర్గంలోని సబ్బవరం, పెందుర్తి, పరవాడ, పెదగంట్యాడ మండలాల ఓటరు జాబితాపై

సమీక్షించారు. వెయ్యిమంది జనాభా ఉంటే 700 ఓటర్లు ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1100  à°²à±, పట్టణ ప్రాంతాల్లో 1300 ఓటర్లు ఉంటే అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు

చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో వసతులను మెరుగుపరచాలని చెప్పారు. కొన్ని పాఠశాలలో ర్యాంపులు లేవని ర్యాంపులు నిర్మించాలని సూచించారు. ఓటరు నమోదు పై అవగాహన

కల్పించాలన్నారు. ఫారం 6,7,8 లను అందరికి అందుబాటులో ఉంచాలన్నారు. ఎ ఇ ఆర్ ఓలకు కంప్యూటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లను నియమిస్తామన్నారు. బి.ఎల్ ఓ లకు గౌరవ వేతనం పెంచాలని

కోరగా సామకూలంగా స్పందించారు. 
ఈ సమావేశంలో ఇ ఆర్ ఓ, ఆర్ డి ఓ తేజ్ భరత్, పెందుర్తి, సబ్బవరం, పెదగంట్యాడ, పరవాడ మండలాల ఎ ఇ ఆర్ ఓలు, బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల

సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dnsnews  #dns news #dnslive  #dns live  #dnsmedia  #dns media  #andhra pradesh  #ap  #elections  #election commissioner  #vizag  #visakhapatnam  #pendurty  #parawada

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam