DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాంగ్రెస్ తో జతకడితే  బట్టలూడతీయటం ఖాయం: ఎమ్మెల్యే రోజా 

విశాఖపట్నం, ఆగస్టు 26, 2018 (DNS Online ): కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన తెలుగుదేశం పోటీ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో జతకడితే  à°šà°‚ద్రబాబు తో సహా పార్టీ à°•à°¿ జనం

బట్టలూడతియ్యడం ఖాయమని, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ కె రోజా ఎద్దేవా చేశారు. ఆదివారం నగరం లోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆమె

మాట్లాడుతూ  à°†à°‚ధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మహిళలకు రక్షణ కల్పించలేని తెలుగుదేశం ప్రభుత్వం తక్షణం గద్దె దిగేలా రాష్ట్రం లోని మహిళలంతా శపథం పట్టాలి అన్నారు.

ఏపీలో మహిళలు చంద్రబాబుని నమ్మి 2014 లో రాఖీ కట్టి అధికారం ఇస్తే ఆయన వారికి రక్షణ లేకుండా చేశారన్నారు. రిషితేశ్వరి మొదలు వనజాక్షి వరకూ మహిళలు అన్యాయం పాలయ్యారని,

కాల్ మనీ బాధిత మహిళలకు నేటికీ న్యాయం లేదు. బ్రిటిష్ పాలకులు కూడా మహిళలను ఇంతగా వేధించలేదని, అయిదేళ్ల పసిదాని మొదలు అరవై ఏళ్ల వృద్ధురాలు వరకూ అత్యాచారాలకు

గురయ్యే పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు డబల్ డిజిట్ గ్రోత్ సాధించింది à°ˆ అత్యాచారాల్లోనేనని,  à°†à°¨à°¾à°¡à± తన పార్టీ లో‌తప్పు చేసిన వారిమీద చర్యలు తీసుకుని ఉంటే à°ˆ

రోజు మిగతా వాళ్లు భయపడి ఉండే వాళ్లు అని సూచించారు. చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీ చాటున ఉండి దోచుకుని, ఇపుడు బీజేపీ బూచి అనీ, వైకాపా ఆ బీజేపీతో కలుస్తుందనీ

దుష్ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ తో చంద్రబాబు ఎప్పుడో కలిసి పోయాడన్నారు. చంద్రబాబు ఇటీవల  à°•à°°à±à°¨à°¾à°Ÿà°•à°²à±‹ రాహుల్ గాంధీని కౌగలించుకున్నాడని, ఇది ప్రజలకి

ఇద్దరి మధ్య కాబోయే జోడి à°•à°¿ సంకేతమేన్నారు. 

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని వై ఎస్ జగన్ పోటీ ప్రకటించారని, అదే విధంగా ఒంటరిగా పోటీ

చేస్తామని ప్రకటించే దమ్ముందా చంద్రబాబు కు ఉందా అని ప్రశ్నించారు. జగన్ కాంగ్రెస్ కి రాజీనామా చేసి బయటకు వచ్చినపుడు బీజేపీతో కలిసిపోతున్నాడని చంద్రబాబు

ఊదరకొట్టించాడు. చివరికి తానే బీజేపీతో కలిశాడు. తర్వాత వైకాపాని తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నారు. ఈ రోజు ఆయనే కాంగ్రెస్ తో కలిసి పోయాడు అన్నారు. జగన్

రెండున్నర కోట్ల మహిళలకు నవరత్నాల్లో ఇచ్చిన హామీలు వారికి గొప్ప భవిష్యత్తును ఇస్తాయని తెలిపారు. 

యనమల వెళ్ళింది పెట్టుడు పళ్ళ కోసమా? పెట్టుబడుల కోసం

కాదా ?

యనమల రామకృష్ణుడు గారు పెట్టు బడులకోసం సింగపూర్ వెళ్లారనుకున్నాం. పెట్టుడు పళ్లకోసం వెళ్లారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రులే అనేక ఆరోపణలు

ఎదుర్కొంటున్నారు. వారిని పక్కనపెట్టుకుని నీతి కబుర్లు చెప్పటం చంద్రబాబుకే చెల్లిందన్నారు.  à°ˆ విలేకరుల సమావేశం లో నగర మహిళా వైఎస్ ఆర్ కాంగ్రెస్

అధ్యక్షురాలు గారికిన గౌరీ, నగర మహిళా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #ysr congress #rk roja  #mla  #ysr women

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam