DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు భాష ప్రాధికారం కాదు సాధికారం లోకి  తేవాలి : 

విశాఖపట్నం, ఆగస్టు 29, 2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటుకై ప్రకటన విడుదల చేసిందని, అయితే అది సాధికారం లోకి రావాల్సిన అవసరం

ఉందని  à°†à°šà°¾à°°à±à°¯ నాగార్జున విశ్వ విద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్టర్ బాల మోహన్ దాస్ పిలుపు నిచ్చారు. విద్యార్థులకు పాఠశాల దశ నుంచే తెలుగు భాష లో మాట్లాడడం, వ్రాయడం,

అలవాటు చెయ్యాలని తెలుగుదండు పిలుపునిచ్చింది. బుధవారం నగరం లోని మద్దిలపాలెం జాతీయ రహదారి వద్ద గల తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు భాష

దినోత్సవాన్నినిర్వహించారు. ముందుగా తెలుగు తల్లి విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం ఆంధ్ర విశ్వ కళాపరిషత్ మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ వెలగపూడి ఉమా మహేశ్వర

రావు మాట్లాడుతూ ప్రస్తుత మారుతున్న సమాజ అవసరాల కోసం ఆంగ్ల భాష నేర్చుకున్నప్పడికీ, విద్యార్థులకు చిన్నతనం నుంచే తెలుగుభాషలో చక్కగా మాట్లాడడం, వ్రాయడం, దోష

రహితంగా సంభాషించడం వంటివి అలవాటు చెయ్యవలసిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు, రాష్ట్రాల్లో వారి వారి మాతృభాషల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని,

అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా తెలుగు భాష అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వమే కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో ప్రజా గాయకుడూ వంగపండు గిడుగు రామ్మూర్తి పై

గేయం పాడి అందరినీ అలరించారు. తెలుగుదండు ఆధ్వర్యవంలో జరిగిన ఈ కార్యక్రమం లో పరవస్తు ఫణిశయన సూరి, కవిధాస్, అరుణ్కుమార్, ఉదయశ్రీ, పలువురు తెలుగు విభాగపు

విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #telugu bhasha day  #telugu talli  #telugu dandu  #vangapandu  #gidugu rama murty

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam