DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంటింటికీ ప్రజల చెంతకే  పోస్టల్ బ్యాంకులు : పి ఎం జి   ఏలీషా, 

విశాఖపట్నం, ఆగస్టు 31, 2018 ( DNS Online ): ప్రజల చెంతకే బ్యాంకుల సేవలను అందించేందుకు దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ( ఐ పిపిబి) ద్వారా

సేవలు అందించనున్న సేవ కేంద్రాల్లో విశాఖపట్నం లోని à°Žà°‚ వి పి కోలనీ లోని శాఖలో కూడా ప్రారంభం అవుతున్నట్టు విజయవాడ  (విశాఖ ) ప్రాంత పోస్ట్ మాస్టర్ జనరల్  à°•à°²à±à°¨à°²à±

ఎం. ఏలీషా తెలియచేసారు. శుక్రవారం నగరం లోని పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ మొత్తం 650 శాఖల ద్వారా 3250 యాక్సిస్

పాయింట్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. విశాఖపట్నం లో ఎంవిపి కోలనీలో à°’à°• శాఖ తో పాటు, మారో నాలుగు యాక్సిస్ పాయింట్లను ప్రారంభిస్తున్నామన్నారు.   విశాఖపట్నం

లో ఎంవిపి కోలనీలో ని ఐ పిపిబి శాఖను రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు ప్రారంభిస్తారని,  à°ˆ కార్యక్రమానికి విశాఖపట్నం లోక్ సభ సభ్యులు డాక్టర్

కె హరిబాబు అధ్యక్షత వహిస్తారని, విశాఖ ఉత్తర నియోజక వర్గ శాసన సభ్యులు పి. విష్ణుకుమార్ రాజు,  à°µà°¿à°¶à°¾à°– తూర్పు శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, జిల్లా పరిషత్

చైర్ పర్సన్ లాలం భవాని, తదితరులు పాల్గొంటారన్నారు. à°ˆ కార్యక్రమం సెప్టెంబర్ 1 à°¨ మధ్యాహ్నం ౨: 30 గంటలకు జరుగుతుందని వివరించారు. 

యాక్సిస్ పాయింట్లలో వెలంపేట

లోని ప్రధాన పోస్ట్ ఆఫీస్ లోని  à°¯à°¾à°•à±à°¸à°¿à°¸à± పాయింట్ ను విశాఖ దక్షిణ నియోజక వర్గం శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, ఫోర్ట్ వార్డ్ ఎస్ à°“ లోని  à°¯à°¾à°•à±à°¸à°¿à°¸à± పాయింట్ ను

à°Žà°‚ ఎల్ సి ఎంవీవీఎస్ మూర్తి, హెచ్ బి కోలనీ ఎస్ à°“ లోని  à°¯à°¾à°•à±à°¸à°¿à°¸à± పాయింట్ ను à°Žà°‚ ఎల్ సి పివిఎన్ మాధవ్, ఆంధ్ర విశ్వ కళాపరిషత్ దూర విద్యాకేంద్రంలోని లోని  à°¯à°¾à°•à±à°¸à°¿à°¸à±

పాయింట్ ను ఎయు ఎవడెమిక్ అఫైర్స్ డీన్ డాక్టర్ à°Žà°‚ వి ఆర్ రాజు లు ప్రారంభిస్తారన్నారు. 

ఐ పిపిబి ద్వారా సేవింగ్స్ అకౌంట్, కరంట్ అకౌంట్, నగదు బదిలీ,

చెల్లింపులు, నేరుగా లభిదారులకే చెల్లింపులు, యుటిలిటీ చెల్లింపులు , బిల్లులు, ఇతర వ్యాపార లావాదేవీలను ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చని వివరించారు.

ప్రధానంగా గ్రామీణ స్థాయిలో ఈ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకు రానున్నట్టు తెలిపారు. కౌంటర్ సేవలు, మైక్రో ఏటీఎం లు, మొబైల్ బ్యాంకింగ్ ఎస్ ఎంఎస్, ఐవైఆర్

ద్వారా సేవలు పొందవచ్చన్నారు. 
అత్యధికంగా విస్తరించిన పోస్టల్ శాఖా ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అత్యంత చేరువగా వెళ్లగలుగుతామన్నారు. గ్రామీణ డాక్

సేవక్ లు ద్వారా ఇంటింటికీ బ్యాంకింగ్ సేవలను అందించగలమన్నారు. కాగిత రహిత లావాదేవీలను నిరక్షరాస్యులు సైతం సునాయాసంగా నిర్వహించుకోగలరన్నారు. 

 

 

#dns 

#dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #post master general  #pmg elisha  #col elishaa  #postal bank  #IPPB 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam