DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రాభివృద్ధిని  రెండు కుటుంబాలే  అడ్డుకున్నాయి : జన జాగృతి గీత 

విశాఖపట్నం, సెప్టెంబర్ 03 , 2018 (డిఎన్ఎస్ ) :  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°¾à°­à°¿à°µà±ƒà°¦à±à°§à°¿à°¨à°¿  à°°à±†à°‚డు బలమైన కుటుంబాలు అడ్డుకున్నాయని జన జాగృతి పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత మండిపడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా అస్తవ్యస్తంగా చిన్నాభిన్నమై పాలన ప్రజలకు ఏనాడో దూరమై పోయిందని, ప్రజలకు మంచి పాలన దగ్గర చేసేందుకే జన జాగ్రతి ఆవిర్భవించిందని అరకు లోక్

సభ సభ్యురాలు కొత్తపల్లి గీత తెలిపారు. సోమవారం నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ గత నాలుగున్నర ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజా

సంక్షేమం కోసం ఆలోచన కూడా చెయ్యడం లేదని, పైగా మోసపూరిత, ఆర్భాటాలతో కూడిన ప్రకటనలు చేసి సామాన్య ప్రజానీకాన్ని మోసం చేస్తున్నాయన్నారు. ప్రజలను కేవలం ఓటు

బ్యాంకు గానే చూసారు తప్ప, ప్రజలను నమ్మక ద్రోహం చేస్తున్నామనే కనీసం ఇంగితం లేకుండా పోయిందన్నారు. అసాధ్యమైన హామీలను ఇబ్బడి ముబ్బడిగా గుప్పించి, ప్రజలను

తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. సామాజిక వర్గాల మధ్య చిచ్చు రేపడం కూడా దీనిలో భాగంగా మారిందన్నారు. గ్రామీణ ప్రాంతాలతో అత్యంత సాన్నిహిత్యం ఉండడంతో

సామాన్య ప్రజలకు అవసరమయ్యే కనీస అవసరాలను వారికి చేరువ చేసేందుకే జన జాగృతి పేరిట రాజకీయ పార్టీని ప్రారంభించినట్టు వివరించారు. తనపై ఎటువంటి ఆరోపణలు లేవని,

స్వచ్ఛమైన పరిపాలన ప్రజలకు అందించేందుకే ఈ పార్టీ కార్యాచరణ సాగిస్తుందన్నారు. అతి త్వరలోనే ప్రజా క్షేత్రం లోకి వెళ్లి, గ్రామ గ్రామాల పర్యటించి, ప్రజలను

చైతన్య పరుస్తున్నామన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #uttarandhra  #vizianagaram  #srikakulam  #districts  #kothapalli geetha  #jana jagruti  #araku mp 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam