DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణుల సమస్యల వివరణ కోసమే 10 న ఆత్మీయ సదస్సు : కోన రఘుపతి 

ఆధ్యాత్మిక వాతావరణం లో సదస్సు, హాజరు కానున్న ఐవైఆర్, మాజీ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు 

విశాఖపట్నం, సెప్టెంబర్ 8 , 2018 (DNS Online): రాష్ట్రం లో బ్రాహ్మణ సామాజిక వర్గం

ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరించేందుకే ఈ నెల 10 వ తేదీన బ్రాహ్మణ కుటుంబాల ప్రతినిధులతో ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు బాపట్ల శాసన సభ్యులు కోన రఘుపతి

తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వచ్చిన అయన శనివారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ అత్యధికంగా బ్రాహ్మణ సామాజిక వర్గం లోని ప్రజలు

ఆర్ధికంగాను, సామాజిక పరంగాను చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాటిని వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు

కానున్నారని తెలిపారు. విశాఖపట్నం నగరం లోని సిరిపురం కూడలి లో గల విజ్ఞాన్ పాఠశాల మైదానం లో ఈ నెల 10 వ తేదీ, సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు.

సదస్సు కు వచ్చే సభ్యులంతా à°’à°• à°…à°°à°—à°‚à°Ÿ ముందుగానే రావాల్సిందిగా కోరారు. 
ఈ సమావేశానికి ప్రత్యేక అతిధిగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర

ప్రతిపక్ష నాయకులూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు కానున్నారని వివరించారు. ఈ రాష్ట్రం లో బ్రాహ్మణ సామాజిక వర్గం లో అర్చకులు, అర్చకేతరులు, స్మార్ట్ పురోహితులు,

పౌరోహిత్యం చేసుకునేవారు, విద్యార్థులు, మహిళలు, యువతీ యువకులు తదితర ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన కు వివరించడం జరుగుతుందన్నారు.
 à°¬à±à°°à°¾à°¹à±à°®à°£ సామాజిక

వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్గిన ప్రతినిధి, ఉన్నతాధికారి గా ప్రభుత్వానికి ఎంతో సేవచేసిన మాజీ ఐ ఏ ఎస్ అధికారి, ఐ వై ఆర్ కృష్ణారావు ప్రత్యేక

ఆహ్వానితులుగా పాల్గొంటున్నారన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ ప్రతినిధులు పెద్ద సమాఖ్య లో హాజరవుతారని, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ

సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశం పార్టీ సభ్యత్వం కోసం కాదని, కేవలం బ్రాహ్మణ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను

తెలియచేయడమేనన్నారు. ఇతరత్రా వ్యక్తులు ఈ సదస్సుపై చేస్తున్న దుష్ప్రచారాన్ని త్రిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సును పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం లో

నిర్వహించండం జరుగుతుందని, ప్రముఖ నేపద్య గాయకుడూ రామాచారి బృందం చే భక్తి సంగీత కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితులుగా

రాష్ట్రంలోని పూర్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రతినిధులు, స్వచ్చంద సేవ సంస్థల కార్యకర్తలు, విద్యార్థులు,  à°ªà±†à°¦à±à°¦ సంఖ్యలో

హాజరవుతానన్నారు. 

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చంద్రబాబు నాయుడు పూర్తిగా మార్చేశారని, కేవలం క్యాస్ట్ -  à°•à±à°¯à°¾à°·à± ఉంటేనే రాజకేయాల లోకి ప్రవేశించగలిగే

విధంగా తయారు చేశారన్నారు. ఈ కారణం వల్లే ఆర్ధికంగానూ, సామాజికంగానూ వెనుకబడి ఉన్న బ్రాహ్మణ సామజిక వర్గం నుంచి రాజకీయాల్లోకి పెద్దగా ఎవరూ

రాలేకపోతున్నారన్నారు. 


బ్రాహ్మణ కార్పొరేషన్ ను ప్రక్షాళన చెయ్యాల్సిందే :

మాజీ ఐఏ ఎస్ అధికారి ఐ వై ఆర్ కృష్ణారావు,  à°šà±†à°‚గవల్లి వెంకట్ à°² నేతృత్వంలో

ప్రారంభించబడిన ఆంధ్ర ప్రదేశం బ్రాహ్మణ కార్పొరేషన్ ( ఏ బి సి) తొలినాళ్లలో బాగానే నిర్వహించబడేదన్నారు. దీన్ని ఏర్పాటుచేసిన సందర్బంలో తాము చంద్రబాబుకు

ధన్యవాదములు కూడా తెలియచేశామన్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఐ వై ఆర్ ను పదవీచ్చుతుణ్ణి చేసిన తదుపరి ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా మిగిలినవాటిల్లా

కేవలం కాయితాలకే పరిమితమైందన్నారు. మొత్తం రూ. 500  à°•à±‹à°Ÿà±à°²à± నిధులు ఇస్తామన్నారు, అయితే ఇంతవరకూ కేవలం రూ. 175 కోట్లకు పరిమితం చేశారన్నారు. పధకాలను పూర్తిగా

నిర్వహించలేక చతికిలపడుతున్నారన్నారు. దీన్ని తక్షణం ప్రక్షాళన చెయ్యాలని డిమాండ్ చేశారు. 

ఈ విలేకరుల సమావేశం లో నగరం లోని ప్రముఖ బ్రాహ్మణ సంఘాల

ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #brahmin  #atmeeya sadassu  #kona raghupati  #vijnan college

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam