DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణులంటే గౌరవం అంటాడు స్పష్టమైన హామీ ఇవ్వడు - ఇదే జగన్ తీరు 

విశాఖపట్నం, సెప్టెంబర్ 10 , 2018 (DNS Online): గత 259 రోజులుగా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జిల్లాల పట్టి తిరుగుతున్నవైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరికి బ్రాహ్మణ సంఘాలు సంశయం లో

పడుతున్నాయి. సోమవారం నిర్వహించిన ఆత్మీయ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వందలాది బ్రాహ్మణ ప్రముఖులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఎదుట ఏకరువు పెట్టినా కనీసం స్పష్టమైన హామీ ఇవ్వలేక పోయారు. ఒకప్రక్క బ్రాహ్మణులంటే తమ కుటుంబానికి గౌరవం అంటారు, వాళ్ళ సమస్యలపై ఎటువంటి స్పష్టమైన హామీ

ఇవ్వలేదు. కేవలం తమ నవరత్నాలకే ప్రాధాన్యం ఇచ్చారు తప్పితే, ఒక్కరికి నమ్మకం కుదిరిన దాఖలాలు లేవు. అయితే సభకు హాజరైన ప్రతినిధులంతా పార్టీ సభ్యులు, పార్టీ

అభిమానులు కావడం తో ప్రశ్నించే ధైర్యం చెయ్యలేక పోయారు. పైగా ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రతినిధులకు పార్టీ విశ్వాసం కలిగేంత హామీలు ఇవ్వడం లో వైఎస్

జగన్ వైఫల్యం చెందారు అన్నది వాస్తవం. అయితే నిర్వాహకులు సైతం ఆ ప్రయత్నం చెయ్యడం లో వైఫల్యం చెందారు. ఒక్కొక్కరుగా సమస్యలు వివరించాలని సూచించారు. పైగా

కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభ లోకి ప్రవేశించ దానికి ముందే ప్రతినిధులను తమ సమస్యలను వివరించాలి అని ఆదేశంచడం జరిగింది.

సభలో ఉన్నవారూ బ్రాహ్మణులే, సమస్యలను వివరించే వారూ బ్రాహ్మణులే...  à°µà±€à°³à±à°³à± ఎదుర్కొంటున్న సమస్యలు అందరికీ తెలిసిందే. అయితే à°ˆ సమస్యలు తెలుసుకోవాల్సిన వ్యక్తి వై

ఎస్ జగన్ మోహన్ రెడ్డి. అతను సభకి రాకముందే వీళ్ళ సమస్యలు వినిపించేస్తే..  à°…తనికి వీళ్ళ సమస్యలు ఎలా తెలుస్తాయి అన్ని విచక్షణ లేకుండా పోయింది. తీరా అతను వేదిక

పైకి వచ్చిన తర్వాత ప్రసంగించిన వారు ఎమ్మెల్యే కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ సాంస్కృతిక అధ్యక్షులు టి విజయ్ చందర్ వీళ్ళే. వీళ్లంతా నిత్యం

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో మాట్లాడేవాళ్లే కావడం గమనార్హం.  à°µà°¿à°¶à°¾à°– లో వేదిక పెట్టింది, ప్రజల్లోని వాళ్ళతో ఎక్కువగా మాట్లాడిస్తే ప్రజల్లో వీళ్ళ పట్ల నమ్మకం

కుదిరేది. కేవలం ఆరుగురికి మైకు ఇవ్వడం తో వాళ్ళే మొత్తం బ్రాహ్మణ సమాజానికి ప్రతినిధులు అనుకుంటే ఎలా ? పైగా ఏ ఒక్క సమస్య పైనా జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా

అవగాహనా కల్గించే ప్రయత్నం నిర్వాహకులు చెయ్యక పోవడం గమనార్హం. సమావేశం లో ఏర్పాట్ల పరిస్థితి ఎలా ఉన్నా. . . సమావేశం లో ఫలితం మాత్రం ప్రశ్నార్థకంగానే

మిగిలిందనడం అక్షర సత్యం. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #ys jagan mohan reddy  #ys jagan  #brahmin  #brahmana

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam