DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణ కార్పొరేషన్ మీటింగ్ పెట్టేది ఐ వై ఆర్ ని తిట్టడానికేనా 

విశాఖపట్నం, సెప్టెంబర్ 11 , 2018 (DNS Online): ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య, ఇతర సభ్యులు అధికారికంగా సభలు సమావేశాలు జరిపేది కేవలం మాజీ

చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ని దూషించడానికేనా అంటే అవుననే సమాధానమే వస్తోంది. మంగళవారం విశాఖ నగరం లోని న్యూకాలనీ లో గల సుబ్బలక్ష్మి కళ్యాణమండపంలో జరిగిన

ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ( ఏబీసీ), క్రెడిట్ సొసైటీ లు సంయుక్తంగా  à°¬à±à°°à°¾à°¹à±à°®à°£ ఆత్మీయ సదస్సు అధికారికంగా నిర్వహించాయి. దీనిలో ప్రధాన అజెండా à°—à°¾

కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ సభ్యులకు అందించే పధకాలను తెలియచేస్తామని ప్రకటించారు. అయితే సభ మొదలైన దగ్గర నుంచి దాదాపుగా ప్రతీ సభ్యుడు ఏబీసీ పూర్వ చైర్మన్

ఐవైఆర్ కృష్ణా రావు ని తిట్టడమే పనిగా పెట్టుకుని దాదాపు రెండుగంటల సమయం గడిపేశారు. ఇది కేవలం అతన్ని తిట్టడం కోసమే పెట్టిన సభలా ఉంది తప్ప బ్రాహ్మణులకు ఉపకారం

చేసే పధకాలను వివరించే సభలా ఏమాత్రం జరగలేదు అన్నది వాస్తవం. 

దీనికి ప్రధాన కారణం నిన్నటి రోజున ( సోమవారం) ప్రతిపక్ష పార్టీ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ

ఆధ్వర్యవం లో విశాఖ నగరంలోనే బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు నిర్వహించారు. దీనికి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అధ్యక్షతన జరిగిన ఈ సభకి ఐ వై ఆర్ కృష్ణారావు విశిష్ట

అతిధిగా హాజరయ్యారు. అయితే ఆ సభలో అయన ఎవరినీ దూషించక పోయినా, అధికార పార్టీ సభ్యులు, ప్రస్తుత చైర్మన్ మాత్రం ఐ వై ఆర్ ను నిందించని సభ మాత్రం కనిపించడం లేదు అన్నది

వాస్తవం.
 à°¬à±à°°à°¾à°¹à±à°®à°£ సమాజానికి మేలు చేసిన చంద్రబాబు కు మద్దతు ఇవ్వండి అని పిలుపునివ్వడం లో తప్పు లేదు, కానీ ఇతరులను దూషించడమే పనిగా జరుగుతున్న సభలపై సర్వత్రా

భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #brahmin  #atmeeya sadassu  #kona raghupati #vijnan college #ananda surya  #IYR Krishna Rao 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam