DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇదే లెక్కన వెళ్తే జనవరిలోనే ఎన్నికలు.: జగన్ కు మేటర్ ముందే లీక్.

విశాఖపట్నం, సెప్టెంబర్ 13 , 2018 (DNS Online):  à°†à°‚ధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జనవరిలోనే జరుగుతాయి అని ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగానే లీకులు

అందినట్టున్నాయి. దానికి పరిణామమే ఇటీవల జరిగిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం లో పార్టీ కేడర్ కు జనవరి లో ఎన్నికలు సిద్ధంగా ఉండమని

ఆదేశించారు. ఇప్పడికే తెలంగాణ లో ప్రభుత్వం స్వచ్చందంగా పడిపోయింది. ఇక మిగిలింది ఆంధ్రాలో, చంద్రబాబు ను రాజీనామా చెయ్యమంటే చెయ్యడు కనుక, దీనికి ఏకైక మార్గం

ప్రభుత్వం పడగొట్టడమే. అందుకే ఇదే పనిలో పడింది మోడీ అండ్ కో. ఎప్పుడో 8 ఏళ్ళ క్రితం నాటి పిటి కేసును భూతం లో చూపించేలా మహారాష్ట్ర న్యాయస్థానం తో వారెంట్ పంపారు.

ఇక తదుపరి తెలంగాణ లో బరువైన కేసు చంద్రబాబు ముందుకు రానుంది. అదే ఓటుకు నోటు కేసు, దీనిలో చంద్రబాబు కు నేరుగా పాత్ర ఉంది అన్నది బలంగా నిరూపితం అయితే పరిస్థితి

పూర్తిగా మారిపోతుంది. ఆ తదుపరి సీబీఐ కేసులు బయట పెట్టి, పూర్తిగా చంద్రబాబు అండ్ కో ను ఆడకత్తెర లో పోకచెక్కలా మార్చేందుకు ఢిల్లీ బృందం ప్రణాళిక సిద్దం

చేసినట్టు తెలుస్తోంది. అందుకే పిటి కేసు పెట్టి ముందుగా హెచ్చరికలు జారీ చేశారు, దీనికి లొంగక పొతే ఓటుకు నోటు కేసు, దానికీ లొంగక పొతే చివరి అస్త్రంగా సిబిఐ

కేసులు బయట పడనున్నట్టు తెలుస్తోంది. 
దీనిలో భాగంగానే ప్రతిపక్ష పార్టీ నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి పూర్తి స్థాయి లో మేటర్ లీక్ చేసి జనవరి లో ఎన్నికలకు

సిద్ధపడాలని సుస్పష్ఠంగా ఆదేశాలు జారీ చేసినట్టే తెలుస్తోంది. ఇదే వాస్తవరూపం దాలిస్తే జనవరి లో తెలంగాణ తో కలిసి ఎన్నికలు జరగడం తధ్యంగా

కనిపిస్తోంది. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #narendra modi  #chandrababu naidu 
 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam