DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖపట్నం గణేష్ మండపాల్లో ఆకట్టుకుంటున్న పద్య నాటకాలు 

విశాఖపట్నం, సెప్టెంబర్ 17 , 2018 (DNS Online ): వినాయక చవితి చలువ పందిళ్ళలో జరుగుతున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. విశాఖనగరం లోని ప్రధాన కూడలి

సీతమ్మ పేట లో గణ దుర్గా గణపతి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన పందిళ్ళలో రోజుకొక సాంస్కృతిక

కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది. అదే క్రమం లో ఇక్కడ జరిగిన శ్రీ కృష్ణార్జున యుద్ధం పద్య నాటకం లో నటులు హావ భావాలతో, వాచకం తో అత్యద్భుతంగా రచింపచేశారు.

కృష్ణార్జున సంవాదం లో జరిగే పద్యాలను అలలవోకగా పాడి వినిపించారు. 

నరసింహ నగర్ లో :  à°¨à°°à°¸à°¿à°‚హానగర్ కోలనీ యూత్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యవం లో శ్రీ

వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా సాగుతున్నాయి. 


నరసింహ నగర్ లోని రైతు బజార్ వద్దగల పార్కులో ఏర్పాటు చేసిన ఉత్సవ మండపం వద్ద అంగరంగ

వైభవంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో నిర్వాహక కమిటీ చైర్మన్, ప్రముఖ న్యాయవాది పి శ్రీనివాస్ మాట్లాడుతూ యువతలో ఆధ్యాత్మిక స్ఫూర్తి కల్గించేందుకు గత తొమ్మిది

సంవత్సరాలుగా సంప్రదాయ బద్దంగా యువత à°•à°‚à°•à°£ ధారణ చేసి ఆరాధనలు చేస్తున్నారన్నారు. మొత్తం 21 మంది యువకులు గణేశ à°•à°‚à°•à°£ ధారణ చేసి దీక్ష à°—à°¾ నిర్వహిస్తున్నారన్నారు. 
à°ˆ

నెల 20 à°µ తేదీన అత్యంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానముల ( à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿) లో శిక్షణ పొందిన ప్రతినిధులచే 
గరుడ సేవ చేస్తూ నగర వీధులలో భారీ ఊరేగింపు జారుతుందన్నారు.

తదుపరి శ్రీ గోవిందా కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మండపం లో 111 కేజీల భారీ లడ్డు ను స్వామికి నైవేద్యం పెట్టమని, దాన్ని వేలం వెయ్యడం

జరుగుతుందన్నారు.

నరసింహ నగర్ లోను యువత వివిధ వీధుల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారని, అయితే గత తొమ్మిదేళ్లుగా ఈ కోలనీ

లోని యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చి, ఆధ్యాత్మిక పరంగా తయారు చెయ్యాలి అనే సంకల్పంతో కోలనీ అందరితో కలిసి ఒకే వేదిక వద్ద

విగ్రహాన్ని నెలకొల్పడం జరుగుతోందన్నారు. 
కంకణధారులంతా నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజులపాటు ఉదయం, సాయంత్ర వేళల్లో ప్రత్యేక ఆరాధనలు, గణపతి హోమాలతో పాటు

నిత్యా పూజ, గరుడ సేవ, శ్రీనివాస కళ్యాణం, ఇంటింటా గోవింద కార్యక్రమాలను నిర్వహింపచేస్తున్నట్టు వివరించారు. 
అంగరంగ వైభవంగా మేళ తాళాలతో, భాజా భజంత్రీలతో,

అర్చకులు వేదమంత్ర పఠనం చేస్తుండగా వరసిద్ధి వినాయక స్వామీ విగ్రహ విగ్రహ ప్రతిష్టామహోత్సవం జరిగిందని వివరించారు.

కార్యక్రమాల్లో భాగంగా నిత్యం

సాయంత్రం ప్రముఖ సంగీత కళాకారులూ, విద్యార్థిని విద్యార్థులచే సంగీత, నృత్య ప్రదర్శనలతో పాటు, బాల బాలికలచే పద్య పఠనం, భక్తి సంగీత కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

ప్రధానంగా ఈ నెల 20 వ తేదీ గురువారం సాయంత్రం 6 : 30 గంటలకు శ్రీనివాస గోవింద కళ్యాణం తిరుమల తిరుపతి దేవస్థానములలో జరిగే విధంగా నభూతో న భవిష్యతి అన్న రీతిలో

జరుగుతుందని తెలియచేసారు. సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి రోజు సాయంత్రం 6 : 30 గంటలకు మొదలవుతాయన్నారు. 
ఈ నెల 18 న పుస్తక పూజ, తదుపరి మ్యాజిక్ షో, ఈ నెల 19

న మధ్యాహ్నం అన్నప్రసాదం వితరణ, ఈ కార్యక్రమం లో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి ప్రసాదం స్వీకరించవలసిందిగా ఆహ్వానించారు. సాయంత్రం లడ్డు ప్రసాదం వేలం,

తదుపరి ఉమా జ్యోతి చే ట్రాక్ సింగింగ్, ఈ నెల 20 న సాయంత్రం 4 గంటలకు నగర సంకీర్తన, సాయంత్రం అన్నమాచార్య వాగ్దేయ వరదాయిని ఇంటింటా గోవింద కళ్యాణం అత్యంత వైభవంగా

జరుగుతుంది. ఈ నెల 21 న ఉదయం గరిక పూజ, సాయంత్రం అత్యంత వైభవంగా లక్ష దీపారాధన, తదుపరి తిరుమల తిరుపతి దేవసుత్నముల అన్నమాచార్య ప్రాజెక్ట్ ఏ గ్రేడ్ విద్వాన్సులు బి.

రఘునాద్ బృందంచే సంగీత విభావరి జారుతుంది. తదుపరి కొలకత్తా కు చెందిన హిందుస్తానీ క్లాసికల్ విద్వాన్సులు మాహూయ నంది చే హిందుస్తానీ సంగీత కచేరి, వీరికి తబలా

సహకారం బి. ధనుంజయ అందిస్తారన్నారు. ఈ నెల 22 న వినాయక నిమజ్జనం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమాల్లో నగర వాసులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి అనుగ్రహాన్ని

పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ఈ వేడుకల్లో నవరాత్రి ఉత్సవ కమిటీ ప్రతినిధులు వి జె సత్య ప్రసాద్, ఎం. నాని, ఎస్. రాజా హరీష్, మూర్తి తదితరులు

పాల్గొన్నారు.

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #ganesh mandap  #krishna arjuna yuddam  #padya natakam

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam