DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గణేష్ నవరాత్రి వేడుకల్లో వైభవంగా గరుడ సేవ 

టిటిడి వారిచే గరుడ సేవ, శ్రీనివాస కళ్యాణం

నరసింహ నగర్ మండపంలో 111 కేజీల లడ్డు నైవేద్యం

విశాఖపట్నం, సెప్టెంబర్ 20 , 2018 (DNS Online ): విశాఖనగరం లోని నరసింహ నగర్ యూత్

కల్చరల్ స్పోర్ట్స్ వెల్ఫేర్ సంఘం ఆధ్వర్యవం లో వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీనివాసునికి గరుడ సేవ నిర్వహించారు. కోలనీ లోని

వీధుల్లో తిరువీధుల్లో భారీ శోభాయాత్ర చేపట్టారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు, న్యాయవాది శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా వేడుకలను అత్యంత వైభవంగా

నిర్వహిస్తున్నామని, తిరుమల తిరుపతి దేవస్థానముల నుంచి వచ్చిన శ్రీనివాస పెరుమాళ్ళని తీసుకువచ్చి, గరుడ వాహనం పై వేంచేపు చేసి, సుమారు 300 మంది 
అన్నమయ్య సంకీర్తన

బృందాలు ముందు కోలాట నృత్యాలు చేస్తుండగా కోలనీ వీధుల్లో స్వామి ఊరేగింపు చేపట్టామన్నారు. నవరాత్రి మండప వేదిక నుంచి, నరసింహానగర్, రైతుబజార్, పోర్ట్

క్వార్ట్రర్స్ మీదుగా శోభాయాత్ర నిర్వహించామన్నారు. గత నాలుగు ఏళ్లుగా కోలనీ లోని అన్ని యువ సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, ఒకే వేదికగా వినాయక విగ్రహాన్ని

ప్రతిష్ట చేసి వేడుకలు చేస్తున్నామని తెలిపారు. యువత లో హిందూ సంప్రదాయాన్ని అలవాటు చేసి, సంప్రదాయ కార్యక్రమాలను చేపట్టే విధంగా ఈ కార్యక్రమాలు

నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 20 మంది యువకులు కంకణ ధారణ చేసి, దీక్షగా ఉత్సవాలను చేస్తున్నట్టు తెలిపారు. ఈ యువకులే స్వామి వారు వేంచేసిన గరుడ వాహనాన్ని

వీధుల్లో లాగుతూ శోభాయాత్రలో పాల్గొన్నారు. సాయంత్రం అంగరంగ వైభవం గా శ్రీనివాసునికి ఇంటింటా గోవిందా కళ్యాణం పేరిట శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నట్టు

తెలిపారు. ఈ మండపం లో 111 కేజీల భారీ లడ్డు ను స్వామికి నైవేద్యం పెట్టమని, దాన్ని వేలం వెయ్యడం జరుగుతుందన్నారు. నిత్యం సాయంత్రం ప్రముఖ సంగీత కళాకారులూ,

విద్యార్థిని విద్యార్థులచే సంగీత, నృత్య ప్రదర్శనలతో పాటు, బాల బాలికలచే పద్య పఠనం, భక్తి సంగీత కార్యక్రమాలు చేపట్టామన్నారు.  

        కంకణధారులంతా

నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజులపాటు ఉదయం, సాయంత్ర వేళల్లో ప్రత్యేక ఆరాధనలు, గణపతి హోమాలతో పాటు నిత్యా పూజ, గరుడ సేవ, శ్రీనివాస కళ్యాణం, ఇంటింటా గోవింద

కార్యక్రమాలను నిర్వహింపచేస్తున్నట్టు వివరించారు. 
       à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా మేళ తాళాలతో, భాజా భజంత్రీలతో, అర్చకులు వేదమంత్ర పఠనం చేస్తుండగా శోభాయాత్ర

జరిగింది. ఈ వేడుకల్లో నవరాత్రి ఉత్సవ కమిటీ ప్రతినిధులు వి జె సత్య ప్రసాద్, ఎం. నాని, ఎస్. రాజా హరీష్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vizag 

#visakhapatnam  #garuda seva  #ttd  #venkateswara  #tiruveedhi  #ganesh festival
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam