DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోవిందుని కల్యాణంతో పరవశించిన విశాఖ పుర ప్రజలు 

గణేష్ నవరాత్రి వేడుకల్లో ఇంటింటా గోవింద కళ్యాణం 

గోవింద కళ్యాణం జరపడం పూర్వ జన్మ సుకృతం : శ్రీనివాస్ 

విశాఖపట్నం, సెప్టెంబర్ 20 , 2018 (DNS Online ): గానప్రియ

లోలుడు గోవిందునికి అత్యంత వైభవంగా నిర్వహించిన ఇంటింటా గోవింద కల్యాణంలో నామ స్మరణతో విశాఖ వీధులు పులకించిపోయాయి. విశాఖనగరం లోని నరసింహ నగర్ యూత్ కల్చరల్

స్పోర్ట్స్ వెల్ఫేర్ సంఘం ఆధ్వర్యవం లో వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం జరిగిన ఈ గోవింద కళ్యాణం లో తనివితీరా అనుభవించని వారు లేరంటే

అతిశయోక్తి కాదు. 
తిరుమల తిరుపతి దేవస్థానము లో శిక్షణ పొందిన అర్చక స్వాములచే నిర్వహించబడిన à°ˆ శ్రీనివాసుని కళ్యాణం లో గానప్రియ లోలునికి  à°µà±‡à°¦ ప్రమాణంగా జతి

స్వర, వివిధ రాగాలతో ఆరాధన చేసారు. ముఖ్యంగా కళ్యాణి రాగం లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర సహితంగా అష్ట దిక్పాలకులను కీర్తిస్తున్నంత సేపు భక్తులు ఆద్యంతం మైమరచిపోయి,

చప్పట్లతో స్వామిని ఆహ్వానించారు. ఉదయం నుంచి వాతావరణం ప్రశాంతంగా ఉన్నందున, సాయంత్రం అత్యంత వైభవంగా శ్రీనివాసునికి గరుడ సేవ నిర్వహించి, సుమారు 300 మందితో

 à°•à±‹à°²à°¨à±€ లోని అన్ని వీధుల్లోనూ భారీ శోభాయాత్ర సైతం నిర్వహించారు. అంతవరకూ సాధారణంగా ఉన్న వాతావరణం అర్చకస్వాములు వరుణ దేవుని కీర్తించే జతులు పలుకుతున్న

సమయంలో ఒక్కసారిగా వర్షం రావడంతో భక్తుల్లో ఆనందాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 

ఈ కళ్యాణం లో సుమారు 60 మంది ఉభయపరులు పాల్గొని శ్రీనివాసుని అనుగ్రహాన్ని

పొందారు. వీరితో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు సైతం పాల్గొని, భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. 

పూర్వజన్మ సుకృతం : శ్రీనివాస్ 

ఉత్సవ కమిటీ అధ్యక్షులు,

న్యాయవాది శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, తిరుమల తిరుపతి దేవస్థానముల నుంచి తీసుకు వచ్చిన శ్రీనివాస

పెరుమాళ్ళకి గోవింద కళ్యాణం నిర్వహించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్టు తెలిపారు. స్వామిని గరుడ వాహనం పై వేంచేపు చేసి, సుమారు 300 మంది అన్నమయ్య సంకీర్తన

బృందాలు ముందు కోలాట నృత్యాలు చేస్తుండగా కోలనీ వీధుల్లో స్వామి ఊరేగింపు చేపట్టామన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీనివాసునికి వైభవంగా కళ్యాణం

నిర్వహిస్తున్నామని, ప్రతి ఏడాది ఒక్కొక్క అనుభూతి కలుగుతోందన్నారు. స్థానిక పార్కులో ఏర్పాటు చేసిన వేదిక వద్ద గల ప్రాంగణమంతా భక్తులతో నిండి పోవడం తో భక్తుల

సందోహంతో గోవింద నామ స్మరణతో మారుమ్రోగిపోయిందన్నారు. భారీ వర్షం కురిసినా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా తగు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. 

హైందవ

సంప్రదాయాన్ని అలవాటు చేసేందుకే :.

గత నాలుగు ఏళ్లుగా కోలనీ లోని అన్ని యువ సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, ఒకే వేదికగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ట చేసి

వేడుకలు చేస్తున్నామని తెలిపారు. యువత లో హిందూ సంప్రదాయాన్ని అలవాటు చేసి, సంప్రదాయ కార్యక్రమాలను చేపట్టే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

సుమారు 20 మంది యువకులు కంకణ ధారణ చేసి, దీక్షగా ఉత్సవాలను చేస్తున్నట్టు తెలిపారు. ఈ యువకులే స్వామి వారు వేంచేసిన గరుడ వాహనాన్ని వీధుల్లో లాగుతూ శోభాయాత్రలో

పాల్గొన్నారు. సాయంత్రం అంగరంగ వైభవం గా శ్రీనివాసునికి ఇంటింటా గోవిందా కళ్యాణం పేరిట శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మండపం లో 111 కేజీల భారీ

లడ్డు ను స్వామికి నైవేద్యం పెట్టమని, దాన్ని వేలం వెయ్యడం జరుగుతుందన్నారు. నిత్యం సాయంత్రం ప్రముఖ సంగీత కళాకారులూ, విద్యార్థిని విద్యార్థులచే సంగీత, నృత్య

ప్రదర్శనలతో పాటు, బాల బాలికలచే పద్య పఠనం, భక్తి సంగీత కార్యక్రమాలు చేపట్టామన్నారు. 
       à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా మేళ తాళాలతో, బాజా భజంత్రీలతో, అర్చకులు వేదమంత్ర

పఠనం చేస్తుండగా గోవిందుని కళ్యాణం అత్యంత వైభవంగా సాగింది. అర్చకులు జతి స్వరం గానం చేస్తున్నప్పుడు సంప్రదాయ భజంత్రీలకు ధీటుగా పాశ్చాత్య వాయిద్యాలపై సైతం

ఈ జతులను అద్భుతంగా పలికించారు. ఈ వేడుకల్లో నవరాత్రి ఉత్సవ కమిటీ ప్రతినిధులు వి జె సత్య ప్రసాద్, ఎం. నాని, ఎస్. రాజా హరీష్, కె ఎస్ ఆర్ మూర్తి తదితరులు

పాల్గొన్నారు.

 

 

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #kalayan  #ttd  #venkateswara   #tiruveedhi  #ganesh festival  #TTD  #govinda kalyanam

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam