DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రబాబు ప్రచార పిచ్చి కి పరాకాష్టకు ఫలితమే  పుష్కర దుర్ఘటన : కన్నా 

 

సోమయాజులు కమిటీ నివేదిక సిగ్గు చేటు : కన్నా 

విశాఖ భూ దందాలు, పుష్కరాలు ఘటన పై సిబిఐ విచారణకు డిమాండ్ 

29 మంది మృతికి కారణం ఎవరు ?  à°®à±à°–్యమంత్రా లేక

మీడియా నా ?

ఛానల్ అధిపతులు చెప్పాల్సిన అవసరం ఉంది

విశాఖపట్నం, సెప్టెంబర్ 21 , 2018  (DNS Online ) : గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట లో  29 మంది మృత్యువాత పడడానికి

ప్రధాన భాద్యుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబే నాని, భారతీయ జనతా పార్టీ ( బీజేపీ) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ

ప్రకటించారు. శుక్రవారం నగరం లోని సాగర తీరం లో గల బీజేపీ నగర కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కు ధైర్యం

ఉంటే విశాఖ భూ కుంభకోణాలపై,రాజమండ్రి పుష్కరాల్లో 29మంది చనిపోయిన విషయం పై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేసారు.  à°ªà±à°·à±à°•à°°à°¾à°²à±à°²à±‹ తన ప్రచార దాహం కోసం 29 మందిని

పొట్టనపెట్టుకున్న ముఖ్యమంత్రి సోమయాజులు రిపోర్ట్ లో తప్పిదాన్ని మొత్తం మీడియా పైకి నెట్టెయ్యడం అత్యంత దౌర్భాగ్యం అన్నారు. పుష్కరాల సమయంలో ప్రభుత్వం

దగ్గర ఉంది వీడియో తీయించిన డ్రోన్ కెమెరా ల విజువల్స్ కూడా బయట పెట్టాలన్నారు. అసలు ఘటన ఎలా జరిగిందో తెలుస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టే పనులను ప్రజల చెంతకు

తీసుకువెళ్లడమే మీడియా పని అని, సేవ చేసే వారిపైనే నిందలు వేసి తప్పించుకుందామని నాటకాలాడే గజదొంగ చంద్రబాబే నన్నారు. 

2014లో చంద్రబాబు తన అవసరం కోసం

బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు తప్ప, బీజేపీ కి దమ్మిడీ లాభం లేదన్నారు. సీనియార్టీ ఉందని, మనిషి మారాడు అని తెలిసి చంద్రబాబు తో పొత్తు పెట్టుకున్నామని, కానీ

అతని యధాతధంగా నమ్మక ద్రోహం చేశాడన్నారు.  à°…దే విధంగా ధర్మాబాద్ కేసు విషయంలో 37 సార్లు కోర్టుకు వెళ్లకుండా ఉంటె ఇచ్చిన నోటీసులు తప్ప, ఇతరులకు సంబంధం లేదన్నారు.

తెలంగాణాలో ఎలక్షన్స్ వస్తున్నాయి అని కొత్త డ్రామాకు తెరలేపారని, అయితే నోటీసులు అందలేదని, తామే స్వచ్చందంగా లొంగి పోవాల్సియుందన్నారు. 

తెలుగుదేశం

పార్టీ ఒక డ్రామా కంపెనీ:.

తెలుగుదేశం పార్టీ ఒక డ్రామా కంపెనీఅని, ఇందులో చంద్రబాబు నాలుగైదు పత్రాలు వేసే ప్రధాన విలన్ అని, కన్నా హేళన చేశారు. అందుకే

అనేకమార్లు యూటర్న్ తీసుకున్న చంద్రబాబు కు జ్వరం వచ్చిన ఆది మోడీ కుట్రేనని చెప్పినా ఆశ్చర్యపోనక్కర లేదన్నారు. అయితే మోడీ అంటే చంద్రబాబు ఎందుకు

భయపడుతున్నాడో తెలియడం లేదు అన్నారు. 

à°ˆ సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు, విశాఖపట్నం ఎంపీ డాక్టర్  à°•à°‚భంపాటి హారిబాబు, ఆంధ్ర శాసన సభ పక్ష నేత, à°Žà°‚ ఎల్ ఏ

 à°µà°¿à°·à±à°£à±à°•à±à°®à°¾à°°à± రాజు , శాసనమండలి సభ్యులు పివిఎన్ మాధవ్, చెరువు రామకోటయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్,  à°µà°¿à°¶à°¾à°– మాజీ మేయర్ పులుసు జనార్దన్, కాశీ

విశ్వనాధ రాజు,  à°°à°¾à°·à±à°Ÿà±à°° కమిటీ నేతలు, తదితర నాయకులు పాల్గొన్నారు

#dns  #dnslive  #anasenadns live  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #bjp  #kanna lakshminarayana

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam