DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భూదందా ఆరోపణలపై చర్చకు మీరు సిద్ధమా ? జగన్ కు గంటా సవాల్

విశాఖపట్నం, సెప్టెంబర్ 27 , 2018 (DNS Online ): విశాఖపట్నం జిల్లాలో భూ కుంభకోణాలు జరిగాయంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండ్ కో

చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు మేము రెడీ అని, రుజువులతో మీరు సిద్ధమా అని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. గురువారం నగరం లోని ప్రభుత్వ

అతిధి గృహం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ కనిపించిన ప్రతీ ఒక్కరిదగ్గరా ఆధారాలు లేని ఆరోపణలతో అవాకులు చెవాకులు వ్యాఖ్యానిస్తున్న జగన్

అండ్ కో జర్నలిస్ట్ ఫోరమ్ గానీ మరే ఇతర స్వచ్చంద సంస్థలు గానీ ఈ చర్చ ను నిర్వహించేందుకు ముందుకు వస్తాయని, అయితే ప్రతిపక్ష పార్టీ తరపున తగిన ఆధారాలతో

నిరూపించాలని, లేని పక్షంలో మీరు ఏమి చేస్తారని ప్రశ్నించారు. ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడ్డం తప్ప, అవన్నీ పూర్తిగా నిరాధారాలేనన్నారు. మీరు చేసే ఆరోపణలు

వాస్తవాలు అని తేలితే ఏ శిక్షకైనా మేము సిద్ధమని, కానిపక్షం లో వాళ్ళేమి చేస్తారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. రాష్టాన్ని అభివృద్ధి పధంలో తీసుకువెళ్తున్న

తెలుగుదేశం పార్టీపై దుమ్ము వెయ్యాలి అనే దుర్ద తప్ప మరొకటి కాదన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #ysr congress  #ys jagan  #ganta srinivasa rao  #ganta  #land scams

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam