DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రావద్దంటే . . . .  రాళ్ళేస్తారా - గంటా పై వైకాపా ధ్వజం. 

విశాఖపట్నం, సెప్టెంబర్ 27 , 2018 (DNS Online ): ప్రతీ ఎన్నికలకీ పార్టీలు మారే రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ను పార్టీలోకి రావద్దన్నందుకే రాళ్ళేస్తున్నారని వైఎస్ ఆర్

కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. గురువారం నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో గంటా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కారణం అతన్ని

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావద్దని జగన్ మోహన్ రెడ్డి చెప్పడమే ప్రధాన కారణమన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం లోకి రాదు అని

తెలుసుకున్న గంటా, వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి జంపు చేసేందుకు విశ్వ ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి

విజయ సాయి రెడ్డి సైతం గంటా పార్టీ లో చేరేందుకు ప్రత్యనించారని పత్రికాముఖంగానే తెలిపారు. నాటి నుంచి పార్టీ పై విసుర్లు పెంచుతున్నారన్నారు.విశాఖ లో గంటా పై

భూదందాల పై అతని సహచర మంత్రి అయ్యన్న పాత్రుడే సిట్ దర్యాప్తు కమిటీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గంటా భూ దాహం పై

విమర్శించింది ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లా లోకి ప్రవేశించిన తర్వాతేనన్నారు. అంతకు ముందే ఎందరో బాధితులు గంటా పై సిట్ కమిటీ కి ఫిర్యాదు చేశారన్నారు. గంటా

పై అయ్యన్న సహా, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఈ చర్చ కు తమ అధ్యక్షులు వై ఎస్ జగన్నే రావక్కరలేదని, తమ పార్టీ సాధారణ

కార్యకర్త చాలని ఎద్దేవా చేశారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #ysr congress  #telugudesam  #ys jagan mohan reddy  #ganta srinivasa rao

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam