DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా స్వామ్యంలో హింసకు తావులేదు : చంద్రబాబు 

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : చంద్రబాబు 
కిడారి కుమారుడికి గ్రూప్ 1 ఉద్యోగం, రూ. కోటి సాయం.
సోమా కుటుంబానికి ఆర్ధిక సాయం. 
విశాఖపట్నం, సెప్టెంబర్ 28 , 2018 (DNS Online ):

ఇటీవల మావోల చేతులతో అసువులు బాసిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సోమా కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి

చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం ఉదయం విశాఖ పట్నం జిల్లా అరకు, పాడేరు ప్రాంతాలను సందర్శించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వ విప్, అరకు

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరారావు కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కిడారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారితో మాట్లాడి, మానసిక స్థైర్యాన్ని

కల్గించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా, కిడారి, సావేరి సోమా ఆశయాలకు à°…à°‚à°¡à°—à°¾ నిలబడతామన్నారు. 

సర్వేశ్వరరావు కుమారులను అక్కున చేర్చుకున్న చంద్రబాబు..

వారికి à°…à°‚à°¡à°—à°¾ ఉంటానని హామీ ఇచ్చారు. à°ˆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..  à°¸à±‡à°µà±‡ పరమావధిగా విధి నిర్వహణ చేసిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య

చేయడం బాధాకరమని, ఆయన ఆశయాల సాధనకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. కిడారి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.కోటి సాయం అందిస్తామని, కుటుంబసభ్యుల్లో

నలుగురికి రూ.5లక్షల చొప్పున పార్టీ తరపున ఇస్తామన్నారు. కిడారి సర్వేశ్వర రావు  à°šà°¿à°¨à±à°¨ కుమారుడు సందీప్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం లో  à°—్రూప్‌-1 ఉద్యోగం

కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొదటి కుమారుడు శ్రావణ్ కుమార్ రాజకీయ పరంగా తండ్రి కి సహకారం అందిస్తుండడంతో పార్టీ తరపున అతనికి ఏ విధంగా సహకారం అందించాలో

పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కిడారి కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. కాబట్టి విశాఖ నగరంలో వారికి స్థలం కేటాయిస్తాం. ఇల్లు కట్టుకోవడానికి

సాయం చేస్తాం. 

గిరిజన ప్రాంతాల్లో ప్రజా à°•à°‚à°Ÿà°•à°‚à°—à°¾ మారిన బాక్సైట్‌ గనులను మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా à°ˆ ఘటన జరగడం

బాధాకరమన్నారు.  à°ˆ గనులకు అనుమతి ఇచ్చింది  à°µà±ˆà°Žà°¸à±‌ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అనుమటి ఇచ్చినవేనని, అని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేయించిందని, à°ˆ

విషయం తెలియని కొందరు అనసవర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 

సోమా కుటుంబ సభ్యులు ఏడుగురికి  à°’క్కొక్కరికి పది లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున

ఇస్తామని, తెలుగుదేశం పార్టీ తరపున ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు అందిస్తామని తెలిపారు. సోమా రెండవ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. విశాఖ లో ఒక

ఇంటి స్థలం ఇస్తామన్నారు. 

ముఖ్యమంత్రి వెంట డిజిపి  à°†à°°à± పి ఠాకూర్,  à°—ిరిజన సంక్షేమ శాఖా మంత్రి నక్కా ఆనందబాబు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా

రూరల్ ఎస్ పి రాహుల్ దేవ్ శర్మ, పాడేరు శాసన సభ్యులు గిడ్డి ఈశ్వరి, యనమంచిలి శాసన సభ్యులు, విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు, ఐటిడిఎ

ప్రాజక్ట్ అధికారి à°¡à°¿ కె బాలాజీ, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #araku  #paderu  #chief minister  #cbn #MLA  #Kidari  #Soma

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam