DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శిశుమందిర్ లో క్షేత్ర స్థాయి జ్ఞాన విజ్ఞాన మేళాకు ప్రశంసలు 

విజ్ఞాన మేళాతో విద్యార్థుల్లో ఆలోచనా శక్తి వృద్ధి : 

విశాఖపట్నం, సెప్టెంబర్ 30, 2018 ( DNS Online ): విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర నిర్వహిస్తున్న క్షేత్ర స్థాయి

జ్ఞానవిజ్ఞాన వేళా సోమవారం ద్వారకానగర్ లోని శ్రీ కృష్ణ విద్యా మందిర్  à°²à±‹ ప్రారంభమైంది. à°ˆ విజ్ఞాన మేళాను ప్రముఖ పాత్రికేయులు సుమిత్ భట్టాచార్య ముఖ్య అతిధిగా

హాజరై విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమానికి భారతీయ విద్యా కేంద్రం ( బి వి కె ) అధ్యక్షులు డాక్టర్ ఏ. నారాయణ స్వామి అధ్యక్షత వహించారు. కృష్ణ

యూనివర్సిటీ, మచిలీపట్టణం ఉపకులపతి డాక్టర్ ఎస్. రామకృష్ణా రావు, ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ భారత భాగవత రామాయణం లోని విశిష్ట అంశాలను

తెలుసుకుంటూ నైతిక విలువలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుందని, ఇలాంటి విజ్ఞాన వేదికలు, మేళాలు నిర్వహించడం ఎంతైనా

అవసరమన్నారు. విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంయుక్త నిర్వాహక కార్యదర్శి జి ఆర్ జగదీశ్, మాట్లాడుతూ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో ప్రధాన భూమిక

పోషించాలని అన్నారు. తల్లిదండ్రులను ప్రేమతో చూసిన వారు సమాజముని, దేశమును ప్రేమించగలరని తెలిపారు. క్షేత్ర ప్రముఖ్, శ్రీకృష్ణ విద్యామందిర్ కరస్పాండెంట్

 à°°à°¾à°®à°šà°‚ద్ర రాజు , మాట్లాడుతూ à°ˆ విజ్ఞాన మేళాలో విజ్ఞాన శాస్త్రం, వేదం గణితం, సంస్కృత భోద పరియోజన అనే మూడు అంశాలలో పలు ప్రయోగాలు, ప్రశ్న మంచ్ ( క్విజ్) లు, నమూనా

ప్రదర్శనలు విద్యార్థులచే ప్రదర్శించబడతాయన్నారు. తద్వారా విద్యార్థుల్లో క్రొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయని, విశ్లేషణా శక్తిని పెంపొందిస్తాయని

తెలిపారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #sri krishna vidya mandir  #sisu mandir  #bvk  #science fair

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam