DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శిశు మందిర్ లో ముగిసిన దక్షిణ మధ్య క్షేత్ర విజ్ఞాన ప్రదర్శన 

విశాఖపట్నం, అక్టోబర్ 02, 2018 (DNS Online ):  à°µà°¿à°¦à±à°¯à°¾ భారతి దక్షిణ మధ్య క్షేత్ర నిర్వహిస్తున్న క్షేత్ర స్థాయి జ్ఞానవిజ్ఞాన మేళా సమారోహ్ మంగళవారం జరిగింది. ద్వారకానగర్ లోని

శ్రీ కృష్ణ విద్యా మందిర్  à°²à±‹ రెండు రోజుల పాటు జరిగిన  à°•à±à°·à±‡à°¤à±à°° స్థాయి జ్ఞానవిజ్ఞాన మేళా ముగింపు లో దక్షిణ మధ్య  à°•à±à°·à±‡à°¤à±à°° ఉపాధ్యక్షురాలు డాక్టర్ ఎన్.

రాజ్యలక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొనన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ విదేశాల్లో భారత దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని, పర్యావరణమును కాపాడాలని,

విద్యార్థులకు సూచించారు. 
 à°ˆ విజ్ఞాన మేళా లో రెండవ రోజు గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి à°² జయంతి కావడంతో వారిరువురికీ నివాళి అర్పించి

కార్యక్రమాన్ని ఆరంభించారు. 
క్షేత్ర సంస్కృతి భోద వారియోజన ప్రముఖ్ అశోక్ పాటిల్ రెండురోజుల కార్యక్రమ వివరాలు, విజ్ఞాన శాస్త్రం, వేదం గణితం, సంస్కృత భోద

పరియోజనకు సంబంధించిన విశేషాలు, ప్రశ్న మంచ్ ( క్విజ్ లు), ప్రయోగాత్మక ప్రదర్శనలు, ఆచార్య పాత్ర సమర్పణ వివరాలు, విద్యార్థులు సాధించిన ఫలితాలను

వివరించారు. 

ప్రధాన వక్తగా విచ్చేసిన దక్షిణ మధ్య క్షేత్ర కార్యదర్శి పాకా రాజమౌళి మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశ భక్తి అలవాడాలని, మాతృభూమి కన్నా మిన్న

మరేదీ లేదని, రామాయణం లో వాల్మీకి మహర్షి తెలియచేసిన జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనగా జన్మభూమి, కన్నతల్లి స్వర్గం కన్నా మిన్న అని, ప్రతి ఒక్కరు

కన్నతల్లిని, మాతృభూమిని ప్రేమించాలని, జ్ఞానము బ్రహ్మతో సమానమని, విజ్ఞానమనగా తెలుసుకొనుట అని, ఆ జ్ఞానము ఇతరులకు అందించాలని, జ్ఞాన విజ్ఞానములకు నిర్వచనము

చెప్పారు. పరిశోధనాత్మక విజ్ఞానాన్ని సంపాదించి ఉత్తమ పౌరులుగా తయారవ్వాలని తెలియచేసారు. 

ఈ కార్యక్రమం లో ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు

సంబంధించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లో భారతీయ విద్యా కేంద్రంఅధ్యక్షులు నారాయణ స్వామి, విజేతలకు

బహుమతి ప్రదానం చేశారు. బివికె కార్యదర్శి సుబ్రహ్మణ్యేశ్వర రావు, సహకార్యదర్శి చక్రపాణి, పరిపాలనాధికారి తులసి సూర్య ప్రకాశ రావు, పాల్గొన్నారు.

పర్యవేక్షకులుగా క్షేత్ర ప్రముఖ్ ఎం. రామచంద్ర రాజు వ్యవహరించారు. వీరితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి. నాగేశ్వర, కృష్ణ మోహన్, జగన్నాధరావు, పాఠశాల

ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #sri krishna vidya mandir  #sisu mandir  #bvk  #science fair

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam