DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు " దేశానికి" గ్రహణం పట్టిందా ?

ప్రజాప్రతినిధుల మరణం, మొన్నహరికృష్ణ, నిన్న కిడారి, నేడు గీతం మూర్తి 

విశాఖపట్నం, అక్టోబర్ 03, 2018 (DNS Online ): దాదాపు పదేళ్ల కాలం తర్వాత అధికారం లోకి వచ్చిన

తెలుగుదేశానికి గ్రహణం పట్టినట్టు కనిపిస్తోంది. ప్రజాప్రతినిధుల మరణం తో అది నిజమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతవారం విశాఖ జిల్లా అరకు  à°¶à°¾à°¸à°¨

సభ్యుడు కిడారి ససర్వేశ్వర రావు మావోయిస్టుల చేతిలో హతమైన ఘటన విచారణ కూడా ముగియక మునుపే అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్సీ గోల్డ్ స్పాట్ ( గీతం విద్య సంస్థల

చైర్మన్) మూర్తి  à°°à±‹à°¡à±à°¡à± ప్రమాదం లో మరణించినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పడికి కొన్ని వారాల ముందే తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, వ్యవస్థాపకుడు ఎన్ à°Ÿà°¿ రామారావు

కుమారుడు, సినీ నటుడు ఎన్. హరికృష్ణ హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో మృత్యువాత పడ్డారు. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రజా ప్రతినిధులు, కీలక నేతలు ఇలా

ఒక్కొక్కరుగా మృత్యువాత పడడం తో పార్టీకి గ్రహణం పెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరుతోందా నేట్టుగానే ఎప్పుడో పదేళ్ల క్రితం నాటి కేసు

మహారాష్ట్రలోని బాబ్లీ ప్రోజక్ట్ లోకి అనుమతిలేకుండా ప్రవేశించారు అన్న కారణం తో ఇప్పుడు విచారణకు రావడం, తప్పని సరిగా కీలక నేతలంతా కోర్టు గుమ్మం తొక్కవలసి

రావడం. ఎమ్మెల్సీ కొనుగోలు కై జరిగిన బేరసారాల్లో నాటి తెలుగుదేశం సభ్యులు రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ à°—à°¾  à°šà°¿à°•à±à°•à±à°•à±à°¨à±à°¨ ఓటు కు నోటు కేసు లో ఐటి దాడులు, కోర్టు

కేసులు, విచారణ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒకటి తప్పించుకున్నారు అనుకుంటే మరొక పెద్ద సమస్య వీళ్ళ ముంగిట నిలుస్తోంది. అయితే వీటిని పట్టించుకునే

ప్రయత్నం లో మరో తప్పు జరుగుతుందేమో అనే అనుమానాలూ పార్టీ క్యాడర్ లో భయం పట్టుకుంది. 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam #tdp  #telugudesam party

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam