DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ పిహెచ్ డి సెట్ ఫలితాలు విడుదల - 1116 మందే అర్హులు

విశాఖపట్నం, అక్టోబర్ 8, 2018 (DNS Online) : ఆంధ్ర ప్రదేశ్ లోని విశ్వ విద్యాలయాల్లో పి హెచ్ à°¡à°¿ ల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష   2018 ఫలితాలను రాష్ట్ర మానవ

వనరుల శాఖా మంత్రి విడుదల చేశారు. సోమవారం నగరం లోని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లో గల ప్లాటినం జూబిలీ అతిధి గృహం లో జరిగిన కార్యక్రమం లో అయన మాట్లాడుతూ వివిధ

విద్యాలయాల్లో ఒక్కొక్కరు ఒక్కో ప్రవేశ విధానం పాటిస్తున్నారని, అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకే పరీక్ష నిర్వహించి, అర్హతలను బట్టి విద్యార్థులకు

ప్రవేశాలను కల్పించడం జరుగుతుందన్నారు. మొట్టమొదటి సారిగా పిహెచ్ à°¡à°¿ ల్లో ప్రవేశానికి 
ఉమ్మడి పరీక్ష నిర్వహించడం హర్షణీయమన్నారు. ఈ పరీక్షను 2018 ఆగస్టు నెల 24

నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించామన్నారు. 

ప్రవేశాలకు  à°®à±Šà°¤à±à°¤à°‚ 200 మార్కులు ఉంటాయని, వాటిల్లో 180 మార్కులకు వ్రాత పరీక్ష, 20 మార్కులకు మౌఖిక పరీక్ష

నిర్వహిస్తున్నట్టు వివరించారు. వ్రాత పరీక్షల్లో రెండు విభాగాల్లో నిర్వహించామన్నారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూల్, కడప,

తిరుపతి, హైదరాబాద్ నగరాల్లోని కేంద్రాల్లో à°ˆ పరీక్షలు జరిగాయన్నారు. మొత్తం 70 పాఠ్యంశాల్లో పరీక్ష జరిగిందని, వీటికి  24082 మంది దరఖాస్తు చేసుకోగా, 20458 విద్యార్థులు

పరీక్షకు హాజరయ్యారన్నారు. వీటిలో కేవలం 1116 మందే  à°…ర్హత మార్కులు సాధించారని మంత్రి తెలిపారు. మౌఖిక పరీక్షల ఫలితాల తదుపరి ప్రవేశాలను ఆయా విశ్వ విద్యాలయాలు

చేపట్టడం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు www .sche .ap .gov .in /rcet వెబ్ సైట్ లో చూడవచ్చన్నారు. à°ˆ విలేకరుల సమావేశం లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఉపకులపతి డాక్టర్ జి.నాగేశ్వర రావు, ఎయు

రిజిస్ట్రార్ డాక్టర్ నిరంజన్, గాజువాక ఎం ఎల్ ఏ పల్లా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #andhra university  #au  #ganta srinivas  #andhra pradesh  #government  #research  #Ph D  #APRCET

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam