DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాంగ్రెస్ గొంతులో కషాయం నింపుతున్న బీజేపీ 

కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ రాజ నర్సింహా శ్రీమతి భాజపా లో చేరిక,

హైదరాబాద్, అక్టోబర్ 11, 2018 (డిఎన్ఎస్ DNS Online): కాకలు తీరిన కాంగ్రెస్ నేతల గొంతుల్లో కాషాయం

నింపే ప్రయత్నం లో భారతీయ జనతా పార్టీ సఫలీకృతమవుతోంది. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ గరుడ కు మహా కూటమి కుదేలవ్వడం ఖాయం గా కనిపిస్తోంది. గురువారం బీజేపీ కార్యాలయం

లో జరిగిన ఘటన తో తెలంగాణ రాజకీయాల్లో మహా కూటమికి గట్టి ఝలక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి

దామోదర రాజనర్శింహా శ్రీమతి పద్మిని రెడ్డి భారతీయ జనతాపార్టీ లో చేరారు. హైదరాబాద్‌లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో ఆమె కాషాయ

కండువా కప్పుకున్నారు. స్వామి పరిపూర్ణానంద బీజేపీ తరపున బరిలో నిలిచేందుకు రంగం సిద్దమవడం తో ఇతర రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్న స్వామిజి శిష్య బృందం

ఒక్కసారిగా బీజేపీ బాట పడుతున్నారు. పద్మిని రెడ్డి సైతం పరిపూర్ణానంద చేపట్టిన సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. 

జాతీయ పార్టీ బీజేపీ కి

వ్యతిరేకంగా బద్ద వ్యతిరేకులతో సైతం జత కట్టిన కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా రాజనర్సింహ ఉండగా, ఈమె బీజేపీ లో చేరడం పై కాంగ్రెస్ పార్టీ కి

మిగుడు పడడం లేదు. మోదీ నాయకత్వానికి మెచ్చే ఆమె పార్టీలో చేరారని బీజేపీ వర్గాలు పైకి చెప్తున్నా, స్వామిజి నిర్ణయం మేరకే జరిగిందనే సంకేతాలు

తెలుస్తున్నాయి. 

ఆమె కు ఆందోళ్ అసెంబ్లీ టికెట్ ఇవ్వనున్నట్టు సమాచారం, అయితే  à°¤à°¾à°œà°¾ మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ కూడా అదే సీటు ఆశించి ఇటీవలే బీజేపీ లో

చేరడం జరిగింది. బీజేపీ అధ్యక్షులు అమిత్ à°·à°¾ పర్యటించి వెళ్లిన మరుసటి రోజే à°ˆ చేరికలు చోటు చేసుకోవడం సందేహాలకు తావిస్తోంది. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam 

#congress  #bjp  #telangana  #swami paripoornanada 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam