DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉనికి ప్రకటనే లక్ష్యం గానే.. నేతల హత్య : రురల్ ఎస్పీ

విశాఖపట్నం, అక్టోబర్ 14, 2018 (డిఎన్ఎస్ DNS Online): గత నెల విశాఖపట్నం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరా రావు, మాజీ ఎమ్మెల్యే సావేరి సోమా ల హత్య కేవలం తమ ఉనికిని

చాటుకోడానికి మావోలు చేసిన హత్యలుగా ప్రత్యేక విచారణాధికారి డాక్టర్ కె. ఫకీరప్ప, విశాఖ రురల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఆదివారం సంయుక్తంగా నిర్వహించిన

విలేకరుల సమావేశం లో ఈ ఘటన వెనుక వెలుగు చూసిన అంశాలను పత్రిక ముఖంగా వెల్లడించారు. గత కొన్నేళ్లుగా మావోల పై పోలీసు విభాగం ఉక్కుపాదం మోపడం తో దాదాపుగా

ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొన్న తరుణంలో ప్రముఖులను టార్గెట్ చెయ్యడం ద్వారా తిరిగి తమ ఉనికి తెలియచెయ్యాలనుకున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. వీరు

నలుగురు à°®à°¾à°µà±‹à°¯à°¿à°¸à±à°Ÿà±à°² సిద్ధాంతాలకు ఆకర్షితులై సానుభూతిపరులుగా మారినట్లు గుర్తించామని తెలిపారు భోజన సదుపాయం కూడా వీరు కల్పించినట్లు పోలీసులు తెలిపారు.

సుబ్బారావు, శోభన్  ,ఈశ్వరి ,కోమల ను నిందితులు à°—à°¾ గుర్తించి, నలుగురిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. నిందితుల వద్ద నుంచి 8 కరపత్రాలు బ్యానర్లు 10 కిలోల మందుపాతరలు  20

మీటర్ల విద్యుత్ వైరు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టులకు ఆశ్రమ భోజన సదుపాయాలు కల్పించినట్లు ఈ నలుగురు అంగీకరించారని జిల్లా ఎస్పీ

రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #araku  #mla  #livitiputti  #rural sp  #SIT

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam