DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాహుల్ . . .సిద్దు ను  పాక్ కు పార్సెల్ చెయ్యండి : ఆంధ్ర బీజేపీ హెచ్చరిక 

#dns #dnslive #dns live #dnsnews #dns news #dnsmedia #dns media #vizag #visakhapatnam #bjp #suhasini anand #siddu

">

దేశ ప్రతిష్టకు à°­à°‚à°—à°‚ కల్గించే వాళ్ళు పాక్ పోవచ్చు... : ఆంధ్రా బీజేపీ 

విశాఖపట్నం, అక్టోబర్ 14, 2018 (డిఎన్ఎస్ DNS Online): పాక్ పై పిచ్చెక్కిన ప్రేమ కురిపిస్తూ, అఖండ

భారతావని లో విభేదాలు తీసుకువచ్చే వ్యాఖ్యలు చేసిన పంజాబ్ రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు ను తక్షణం భారత్ నుంచి పాకిస్తాన్ కు పార్సెల్ చేసి

అక్కడ మంత్రిగా పంపించే ఏర్పాటు  à°šà±‡à°¸à±à°•à±‹à°µà°¾à°²à°¨à°¿ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ హెచ్చరించింది. సోమవారం నగరం లోని బీజేపీ నగర కార్యాలయం లో

నిర్వహించిన విలేకరుల సమావేశం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కి భారత్ పై కంటే పొరుగు దేశమైన

పాకిస్తాన్ పైనే పిచ్చెక్కే ప్రేమ ఉన్నట్టు ఈ ఘటనతో తెలుస్తోందని, వారికి భారత్ పై ఇష్టం, గౌరవం లేకపోతె నిరభ్యంతరంగా పాకిస్తాన్ పోవచ్చని, కాంగ్రెస్ పార్టీ

అధ్యక్షుడు రాహుల్ కు సూచనలతో కూడిన హెచ్చరికలు జరీ చేశారు. 
సిద్దు కు భారత్ పై ఏమాత్రం గౌరవం లేదని, అతను భారత దేశ ప్రతినిధి గా పాకిస్తాన్ వెళ్లి, భారత్ కు

వ్యతిరేకంగా పదే పదే వ్యాఖ్యానించడం దేశ ద్రోహం క్రిందే పరిగణింప బడుతుందన్నారు. ఇతను గతంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి ప్రమాణ స్వీకారం కోసం

ఒకసారి పాక్ సైనికాధికారి పై ఏరికోరి మరీ ఆలింగనాలూ చేసుకుని నృత్యాలు చేసాడని, దేశమంతా మండిపడుతుంటే, ఇటీవలే పాకిస్తాన్ లో జరిగిన ఓ సెవెంత్ లిటరేచర్

కార్యక్రమం లో పాల్గొంటూ దక్షిణ భారత దేశం పై కక్ష, ఆక్రోశం అంతా విషం క్రక్కినట్టు కక్కాడని మండిపడ్డారు. ఇతని తోటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మణి 
శంకర్

అయ్యర్ అనే మరో పాకిస్తాన్ మతోన్మాది సైతం గతంలో భారత్ కు వ్యతిరేకంగా ఎన్నో వ్యాఖ్యలు చేయడం అందరికి తెలిసిందేనన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వం  à°²à±‹à°¨à°¿ భారతీయ

జనతా పార్టీ కేంద్రం లో చేస్తున్న ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేక, దేశ ప్రజల్లో చీలిక తేవడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న

కుట్రల్లో భాగంగా ఎవడి స్థాయి లోవాడు నటించి జీవించేస్తున్నారన్నారు. ఒక బాధ్యతాయుతమైన హోదాల్లో ఉన్న వ్యక్తి ఇలా దేశ విద్రోహ వ్యాఖ్యలు చెయ్యడం దేశద్రోహం

క్రిందే పరిగణింపబడుతుందన్నారు. తక్షణ తమ పార్టీ పంజాబ్ మంత్రి పై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదా తక్షణం సిద్దు ను పాకిస్తాన్ పార్సెల్ చేసి, అక్కడే మంత్రి గా

పదవి ఇప్పించుకోవాలని రాహుల్ కు సూచించారు. తక్షణం భారత్ దేశ విలువల పై కాంగ్రెస్ పార్టీ కి గౌరవం ఉంది అని నిరూపించుకోవాలంటే సిద్ధూ ని దేశ నుంచి బయటకు పంపాలని

డిమాండ్ చేశారు. 

 

 

#dns #dnslive #dns live #dnsnews #dns news #dnsmedia #dns media #vizag #visakhapatnam #bjp #suhasini anand #siddu

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam