DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వామిజి బీజేపీ లో చేరిక-  అంపశయ్య నుంచి అధికారానికేనా ?

విశాఖపట్నం, అక్టోబర్ 19, 2018 ( DNS Online ): ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, శ్రీపీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద విజయదశమి రోజున ( శుక్రవారం) భారతీయ జనతా పార్టీలో చేరినట్టు

ప్రకటించడం తో ఇటు ఆంధ్ర ప్రదేశ్, అటు తెలంగాణ ప్రాంతాల్లో హిందూ సంప్రదాయవాదుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన హక్కులను అమలు చెయ్యడం

లో బీజేపీ ఘోరంగా విఫలం కావడం తో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పూర్తిగా అంపశయ్య పైకి పోయింది. ఇప్పుడు స్వామిజి చేరికతో అంపశయ్య నుంచి అధికారం లోకి వస్తుందనే

నమ్మకం బలపడుతోంది. అయితే బీజేపీ పార్టీలో ఈయన చేరిక ఎవరికీ లాభం చేకూరుస్తుంది.? ఈయన వల్ల పార్టీకి ఎక్కువ మేలు జరుగుతుందా ? పార్టీ వల్ల ఈయనకు ఎక్కువ మేలు

జరుగుతుందా? అనేది అందరికీ తెలిసిన విషయమే. గత ఎన్నికల్లో బీజేపీ పై, నరేంద్ర మోడీ పై ఎంతో విశ్వాసం తో దేశ వ్యాప్తంగా ప్రజలు ఓటు వేసి సంపూర్ణ అధికారం

కట్టబెడితే గద్దె ఎక్కిన మోడీ చేసిన ఎన్నో పనుల వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పై ప్రజలకు విశ్వాసం, నమ్మకం పూర్తిగా పోయింది. ఈ క్రమం లోనే ఎన్నికలు జరిగితే

కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకునే స్థాయి లో లేదు బీజేపీ. దీనికై ఎంతో పరిశీలన చేస్తున్న బీజేపీ పార్టీ పెద్దలకు బాగా కలిసి వచ్చిన అంశం, స్వామి

పరిపూర్ణానందను హైదరాబాద్ నుంచి బహిష్కరణ చెయ్యడం. ఆ సమయంలో స్వామిజి కి సంఘీభావం ప్రకటించి, అయన దృష్టిని ఆకట్టుకోవడంలో బీజేపీ నేతలు సఫలీకృతులయ్యారు. హిందూ

ధర్మాన్ని సర్వ నాశనం చేస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకుంటున్న ఎన్నో నిర్ణయాలను ఎదిరించిన స్వామిజి కి అండగా నిలిచి, ఆయనకు కొంత భరోసా కల్గించగలిగితే తెలుగు

రాష్ట్రాల్లో కొంత వరకు పట్టు సాధించవచ్చు అనే సమాచారాన్ని బీజేపీ అధ్యక్షులు అమిత్ షా కు నమ్మకం కల్గించగలిగారు. దీంతో వినాయకచవితి సందర్బంగా అమిత్ షా, స్వామి

పరిపూర్ణానంద ను ఢిల్లీ కి ఆహ్వానించి, తొలి విడత చర్చలు జరిపి, విజయ దశమికి మలి విడత చర్చలకు తీర్మానించారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం స్వామిజి విజయదశమి

రోజు పార్టీలో చేరాలి. 
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ దాదాపుగా అంపశయ్య పై కి వెళ్ళిపోయింది. ఇప్పుడు స్వామిజి చేరిక తో కొంతలో కొంత వరకు కనీసం కొన్ని

చోట్లయినా డిపాజిట్లు దక్కించుకునే ప్రయత్నం చెయ్యడం వరకూ ఉపయోగపడవచ్చు అని ఇతర పార్టీలు భావిస్తున్నాయి. అంపశయ్య నుంచి అధికారం లోకే వస్తాం అంటూ బీజేపీ

వర్గాలు ఇప్పడికే తెలంగాణ లోని అన్ని ప్రాంతాల్లోనూ సంబరాలు జరుపుకుంటున్నాయి. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #swamiji  #sri peetham  #paripoornananda  #paripurnananda  #bjp  #amit shah  #telangana

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam