DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కంచి అత్తి వరదుని సన్నిధిలో చిన్న జీయర్ స్వామి 

అత్తి వరదుణ్ణి దర్శించిన ఆచార్య పురుషులు 

అత్తి వరదుణ్ణి ఆర్తితో దర్శించండి అనుగ్రహం పొందండి.

కాంచీపురం, జూలై 03, 2019 (డిఎన్‌ఎస్‌) : అత్యంత అరుదైన

శ్రీ కంచి అత్తి వరదరాజస్వామి ని ఆచార్య పురుషులు, త్రిదండి చిన్న జీయర్ స్వామి మంగళవారం దర్శించుకున్నారు. కంచి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో జీయర్ స్వాములకు

ఆహ్వానం పలికారు. అత్యంత అరుదైన à°ˆ అత్తి వరద రాజ స్వామిని ఆర్తితో భక్తులు దర్శించి స్వామి అనుగ్రహం పొందాలి అని జీయర్ స్వామి తెలియచేసారు. 

ప్రతి 40 ఏళ్లకు ఒక

సారి మాత్రమే లభించే ఈ అత్తి వారసుని దర్శనం తో ఆచార్యులు పులకరించారు. ఈ సందర్బంగా ఈ మూర్తిని పుష్కరిణి లో నిక్షిప్తం చేయడానికి గల చరిత్ర, నాటి అర్చక

శ్రేష్టుల్లో ఉన్న ఆరాధన తపన, హైందవ ధర్మాన్ని పరిరక్షించడం కోసం పడిన కష్టాన్ని భక్తులకు వివరించారు. ఎంతో  à°…పురూపమైన à°ˆ స్వామి దర్శనం కేవలం 40 ఏళ్లకు ఒకసారి

కలుగుతుందని, ప్రస్తుత తరంలో కాల ప్రమాణం రీత్యా à°’à°• భక్తుడు స్వామి ని తన జీవన కాలంలో గరిష్టంగా రెండు మార్లు మాత్రమే దర్శించే అవకాశం ఉంటుంది. 

పూర్వం

ముష్కరులు, ముస్లింలు భారత దేశం పై ఎన్నో దండయాత్రలు చేసి, హిందూ దేవాలయాలు ధ్వంసం చేస్తూ కాంచీపురం వరద రాజస్వామి దేవాలయానికి కూడా చేరుకోవడం తో హైందవ

సంప్రదాయాన్ని కాపాడేందుకు, ఆలయంలోని వరద రాజ స్వామిని రక్షించుకునేందుకు మూల మూర్తిని సమీపంలోని పుష్కరిణి లో భద్రపరిచారు. ఈ మూర్తిని పురాణ కాలంలో ఛతుర్ముఖ

బ్రహ్మ  à°¦à°¿à°µà±à°¯à°®à±ˆà°¨ యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మ చే అత్తి చెట్టు కాండం తొ శ్రీ వరదరాజ స్వామి (వరములను à°¦ అనగా ఇచ్చునట్టి శ్రీ నారాయణుని) విగ్రహాన్ని

చేయించి ప్రతిష్టించారు. à°•à°‚à°šà°¿ పై దండెత్తి దేవాలయాలను కూల్చి సంపదలను దోపిడి చేస్తున్న సమయంలో శ్రీ వారి మూర్తి à°•à°¿ హాని కలుగకుండా వుండేందుకై  à°†à°²à°¯à°‚ లోని ఆనంద

పుష్కరిణి లో నీరాళి మంటపం పక్కగా చిన్న మండపం యొక్క అడుగు భాగం లో ఉంచారట.లోపలికి నీళ్లు చేరని విధం గా జాగ్రత్తలు తీసుకుని వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున

భద్రపరచారట.  à°ªà°°à°¿à°¸à±à°¥à°¿à°¤à°¿ అదుపులోకి వచ్చిన తర్వాత బయటకు à°ˆ మూర్తిని బయటకు తీయాల్సి యుండగా, కారణాంతరాల వల్ల గర్భాలయంలో వేరొక దివ్య మూర్తి ని ప్రతిష్టించారు.

అయితే పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపర్చబడిన శ్రీ అత్తి వరదరాజ స్వామి ని 40 సంవత్సరం లకు ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం

కల్పిస్తారు.

భక్తులకు దర్శనం : 

ప్రతి 40 ఏళ్ళకి ఒకసారి మాత్రమే పుష్కరిణి నుంచి బయటకు తీసే బ్రహ్మ ప్రతిష్ఠిత మూర్తిని   కేవలం 48 రోజుల పాటు మాత్రమే

భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుంది. ఈ ఏడాది జులై 1 న బయటకు తీసిన మూర్తికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సంవత్సరం అంటే 2019

జులై 1 à°µ తేదీ నుండి ఆగస్ట్17 à°µ తేదీ వరకు  à°¤à°¿à°°à°¿à°—à°¿ దర్శనం ఇవ్వనున్నారు. ఇంతకూ ముందు 1979 లో స్వామి దర్శనం లభించింది. 
మొదటి 38 రోజులు శయన (పడుకున్న) భంగిమ లోను చివరి 10

రోజులు స్థానక (నిలుచున్న) à°­à°‚à°—à°¿à°® లో ను దర్శనం ఇస్తారు. 

ఉచిత దర్శనంతో పాటు 50  à°°à±‚పాయల టికెట్ దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఉదయం 11 to 12 వరకు సాయంత్రం 7 to 8 వరకు

రెండు పూటలు స్వామికి సహస్రనామార్చన జరుగుతుంది.ఈ సేవ లో స్వామి ని సేవించడానికి 500 రూ టికెట్ తీసుకోవలసి ఉంటుంది.

ఈ 40 రోజుల కాలం లో ప్రతి రోజూ ఉదయం 6 గం నుండి

మద్యాహ్నం 2 à°—à°‚ వరకు 
తిరిగి మద్యాహ్నం 3 à°—à°‚à°Ÿà°² నుండి రాత్రి 9 à°—à°‚ వరకు స్వామి దర్శనం లభించనుంది. 

కాంచీపురం : 

108 శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాలలో అత్యంత

ప్రాశస్త్యం ఉన్న క్షేత్రం కంచి. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ఆలయాల నగరం గా ప్రసిద్ధి పొందింది. సుమారు 1000 కి పైగా ఆలయాలు కలిగి ఉన్నది. వీటిల్లో 16 దివ్య

క్షేత్రాలు ఉన్న ఏకైక నగరం ఇదే.  à°¦à±€à°¨à°¿à°•à°¿  à°®à±‹à°•à±à°·à°ªà±à°°à°¿ అని పేరు.  à°¶à±à°°à±€ వరదరాజ స్వామి దేవాలయం లో బంగారు వెండి బల్లులు ఉన్న ఆలయం అంటే సుపరిచితం.
 
à°•à°‚à°šà°¿à°•à°¿

చేరుకోడానికి చెన్నై, తిరుపతి à°²  à°¨à±à°‚à°šà°¿ చేరుకోవచ్చు. అన్ని ప్రధాన నగరాల నుంచి రైలు, బస్ సౌకర్యాలు ఉన్నాయి.

 

#dns  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline  #kanchi  #kanchipuram  #jeeyar  #chinna  #atti  #varadaraja  #temple  #pushkarini  #years  #chennai  #tamilnadu  #divyakshetram 

#vaishnava

Recent News

Latest Job Notifications

Panchangam - May 6, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam