DNS Media | Latest News, Breaking News And Update In Telugu

17 మంది తెలుగు ఎంపీలు ఎన్నికల ఖర్చు ఇవ్వక పొతే ఇంటికే. . .

ఎన్నిక రద్దు చేస్తామని ఎన్నికల సంఘం వార్నింగ్

ఎన్నికల వాచ్: 80 మంది ఎంపీలు ఖర్చులు చెప్పలేదు 

ఈసీ లిస్ట్ లో ఆంధ్రాలో  à°µà±ˆà°•à°¾à°ªà°¾ 13 మంది, టిడిపి

ఇద్దరు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . . .

అమరావతి, ఫిబ్రవరి 04, 2020 (డిఎన్‌ఎస్‌) : తెలుగు రాష్ట్రాలకు చెందిన 17 మంది ఎంపీలు తాము ఎన్నికల్లో పెట్టిన

ఖర్చు తక్షణం చెప్పకపోతే వీళ్ళ ఎన్నిక రద్దు చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల లో గెలిచినా మూడు నెలల లోపు ఎన్నికలలో చేసిన

ఖర్చును ఎన్నికల సంఘానికి కచ్చితంగా ఇవ్వాల్సియుంటుంది. లేనిపక్షంలో వాళ్ళ ఎన్నికను రద్దు చేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. అయితే ఎన్నికలు

జరిగి దాదాపుగా 10 నెలలు గడుస్తున్నా నేటికీ వారి ఖర్చులు వివరాలను చెప్పక పోవడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన 17 మంది ఎంపీలకు ఎలక్షన్ కమిషన్ ఝలక్

ఇచ్చింది. 

వైకాపా 13 మంది, టిడిపి ఇద్దరు : . . . 

దీంతో నేషనల్ ఎలక్షన్ వాచ్.. దేశ వ్యాప్తంగా ఖర్చుల వివరాలు తెల్పని 80 మంది ఎంపీల లిస్టును ప్రకటించింది. ఈ

పట్టికలో 15 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు ఉండగా.. మరో ఇద్దరు తెలంగాణకు చెందిన ఎంపీలు ఉన్నారు. వీరిలో అధికారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ à°•à°¿ చెందిన వారు 13

మంది కాగా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఇద్దరు ఉన్నారు.  

వీరు ఎలక్షన్‌లో గెలిచిన 90 రోజుల్లో ఖర్చు వివరాలను ఈసీకి సమర్పించాల్సి ఉంది.

అయితే ఇప్పటి వరకు సమర్పించక పోవడంతో ఈసీ సీరియస్ అయ్యింది. ఎన్నికల ఖర్చు ఫైల్ చేయకుంటే..

తమకు చర్యలు తీసుకునే హక్కు ఉందని ఈసీ హెచ్చరించింది. అఫిడవిట్

దాఖలు చేయని ఎంపీల ఎన్నిక రద్దు చేసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అధిక ఖర్చుల విషయం బయటపడుతుందనే భయం ఎంపిల్లో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గెలిచిన

అభ్యర్థులు 45 రోజుల్లో అఫిడివిట్ ఇవ్వాలని.... ఎలక్షన్ వాచ్ కన్వీనర్ వివి రావు తెలిపారు.

దీంతో నేషనల్ ఎలక్షన్ వాచ్.. దేశ వ్యాప్తంగా ఖర్చుల వివరాలు తెల్పని 80

మంది ఎంపీల లిస్టును ప్రకటించింది. à°ˆ పట్టికలో 15 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు ఉండగా.. మరో ఇద్దరు తెలంగాణకు చెందిన ఎంపీలు ఉన్నారు. వీరు ఎలక్షన్‌లో

గెలిచిన 90 రోజుల్లో ఖర్చు వివరాలను ఈసీకి సమర్పించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు సమర్పించక పోవడంతో ఈసీ సీరియస్ అయ్యింది. ఎన్నికల ఖర్చు ఫైల్ చేయకుంటే..

తమకు

చర్యలు తీసుకునే హక్కు ఉందని ఈసీ హెచ్చరించింది. అఫిడవిట్ దాఖలు చేయని ఎంపీల ఎన్నిక రద్దు చేసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అధిక ఖర్చుల విషయం బయటపడుతుందనే

భయం ఎంపిల్లో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గెలిచిన అభ్యర్థులు 45 రోజుల్లో అఫిడివిట్ ఇవ్వాలని.... ఎలక్షన్ వాచ్ కన్వీనర్ వివి రావు తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 6, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam