DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఢిల్లీ లో హఠాత్పరిణామం :ఆప్ ఎమ్మెల్యే పై కాల్పులు 

ఎమ్మెల్యే సురక్షితం, కార్యకర్త మృతి, à°’à°•à°°à°¿à°•à°¿ గాయాలు  

విజయోత్సవ ర్యాలీ లో జరిగిన ఘటనలో భయానకం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . .

.

అమరావతి, ఫిబ్రవరి 12, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆమ్ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీలోని మెహరౌలీ నియోజకవర్గ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ విజయోత్సవ ర్యాలీ లో ముష్కరులు జరిపిన

కాల్పుల్లో ఎమ్మెల్యే సురక్షితం కాగా ఒక కార్యకర్త మృతి చెందాడు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం విడుదలైన ఢిల్లీ శాసన సభ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ

పార్టీ 63 సీట్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం మెహరౌలీ నియోజకవర్గ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ తన ఇంటికి సమీపంలోని ఆలయంలో

దర్శనానికి వెళ్లి వచ్చిన విజయోత్సవ ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు ఆప్ తన ట్విట్టర్ ఖాతాలో

ప్రకటిచింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఢిల్లీ పోలీసులు అక్కడే ఉండడం గమనార్హం. అయితే ఎవరినీ అరెస్ట్ చేసినట్టు ప్రకటించలేదు. ఈ ఘటన పై అన్ని ఆప్ సహా బీజేపీ నాయకులూ

సైతం à°–à°‚à°¡à°¿à°‚à°šà°¡à°‚ గమనార్హం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 5, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam