DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ - అమిత్ షా భేటీ పై ఎన్నో రాజకీయ ఊహాగానాలు

ఆంధ్రాను ఆదుకోండి : అమిత్ à°·à°¾ కు జగన్ వినతి 

పోలవరం సహా అన్ని ప్రాజెక్ట్ లకూ నిధులు ఇవ్వండి. . .

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) : . .

.

న్యూఢిల్లీ / అమరావతి, ఫిబ్రవరి 14, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆర్ధికంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ను ఆర్ధికంగా ఆదుకోవాలని కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ à°·à°¾

ను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. శుక్రవారం దేశ రాజధాని హస్తినలో జరిగిన వీరిద్దరి భేటీ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయపరమైన

ఊహాగానాలకు తెర లేపుతోంది. అయితే పూర్తిగా అంతర్గతంగా జరిగిన భేటీలో ఇద్దరి మధ్య వచ్చిన అంశాల ఏంటి అనేవి బహిర్గతం కాలేదు. అయితే అధికార వైఎస్సార్ కాంగ్రెస్

పార్టీ ఇచ్చిన వివరాల ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వడమే కాకుండా పోలవరం సహా రాష్ట్రంలోని అన్నిప్రాజెక్ట్ లకూ నిధులు ఇవ్వాలని కోరడానికి

వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శల ప్రకారం వ్యక్తిగత కేసుల నుంచి త్వరగా విముక్తి కల్గించమని వైఎస్ జగన్ కేంద్ర

హోంమంత్రి ని కలిసినట్టు తెలుస్తోంది. ఎవరు చెప్పేది వాస్తవమైన వీరిద్దరి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కరమైన చర్చకు దారి తీసింది.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 5, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam