DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మేడారం జాతరలో 494 హుండీల నిండా నోట్లు, బంగారం

2018 జాతరలో రూ.10.70 కోట్ల ఆదాయం దాటే అవకాశం 

మేడారం లో కొనసాగుతున్న ముడుపుల లెక్కింపు. . .

మొత్తం హుండీలు 494.. ఇప్పటిదాకా లెక్కించినవి 247

4 రోజుల

లెక్కలోనే ఆదాయం రూ. 7 కోట్లు, ఇంకా కొనసాగింపు 

స్వదేశీతో పాటు భారీగా విదేశీ కరెన్సీ, బంగారం. 

కరెన్సీలతో నిండి పోయిన  à°¹à°¨à±à°®à°•à±Šà°‚డలోని టీటీడీ కల్యాణ

మండపం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) : . . . .

అమరావతి, ఫిబ్రవరి 17, 2020 (డిఎన్‌ఎస్‌) : మేడారం జాతరలో వన దేవతల అనుగ్రహం కోసం లక్షలాదిగా వచ్చిన భక్తులు,

సమర్పించిన ముడుపులు లెక్కించడం లో అధికారగణం నిమగ్నమయ్యారు. జాతర ముగిసిన తర్వాత కూడా ముడుపుల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. ఈ జాతర లో మొత్తం 494 హుండీలు ఏర్పాటు

చేయగా, బుధవారం మొదలైన à°ˆ లెక్కింపు శనివారం నాటికి  à°•à±‡à°µà°²à°‚ 297 హుండీలు మాత్రమే లెక్కించడం జరిగింది. à°ˆ హుండీలను లెక్కించేందుకు జిల్లా ప్రధాన కెంరమైన

హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపం వేదిక గా ఏర్పాటు చేసారు. మండపం మొత్తం హుండీల మయంగా మారిపోయింది. కొన్ని చోట్ల లెక్కించిన హుండీలు, మరి కొన్ని చోట్ల ఇంకా

లెక్క చేయవలసిన హుండీలు పేరుకుపోయి ఉన్నాయి. వీటిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ ఎవరిని అనుమతించడం లేదు. 

వీటిల్లో వచ్చిన ముడుపుల

విలువ  à°†à°¦à°¾à°¯à°‚ రూ. 7 కోట్లు ఉంది. à°ˆ హుండీల్లో స్వదేశీ నగదు తో పాటు భారీగా విదేశీ కరెన్సీ, బంగారం కూడా లభ్యమవుతోంది. 

ప్రతిరోజు 300 మంది సిబ్బంది

పాల్గొంటున్నారు.  à°‡à°‚దులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 200 మంది దేవాదాయశాఖ సిబ్బంది ఉన్నారు. మరో 100 మంది మహబూబాబాద్‍ జిల్లా శ్రీలక్ష్మీవెంకటేశ్వర సేవా సమితి

వాళ్లు ఉన్నారు. ఇప్పటివరకు 247 హుండీల్లోని కానుకలను లెక్కించారు.

హుండీల నుంచి కుప్పలు తెప్పలుగా కానుకలు పడుతుంటే వాటిని చూసి అక్కడి సిబ్బంది

ఆశ్చర్యపోతున్నారు. 

రూపాయి నాణేలు నుంచి 2 వేల రూపాయల నోట్ల వరకు హుండీల నుంచి పడుతున్నాయి. 
విదేశీ నగదు తో పాటు గతంలో రద్దయిన ఐదువందల రూపాయల నోట్లు కూడా

దర్శనమిస్తున్నాయి. బంగారు కడియాలు, వెండి కడియాలు, కుంకుమ భరిణెలు, వివిధ ప్రతిమలు బయటపడుతున్నాయి. 

మరో వారంపాటు లెక్కింపు కొనసాగనుంది. 2018 జాతరలో హుండీల

నుంచి రూ.10.70 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.

భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో 494 హుండీలు

ఏర్పాటు చేశారు. ఇందులో 454 ఐరన్‍తో  à°šà±‡à°¸à°¿à°¨à°µà°¿ కాగా, 38 క్లాత్‍ హుండీలు. ఒడిబియ్యం వేసేందుకు వీలుగా 2 ప్రత్యేక హుండీలు ఏర్పాటు చేశారు. జాతర ముగిశాక పటిష్ఠ భద్రత నడుమ

వీటన్నింటినీ హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తీసుకొచ్చి సీసీ కెమెరాల నిఘా మధ్య భద్రపరిచారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 5, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam