DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కుడుముసర చింతపల్లి లో బ్రిడ్జి ఆనాడే నిర్మించాం: సీఎస్ 

*ఆ ఫోటో 2019 నాటిది, వరదల ఫోటో వైరల్ పై DNS కు సిఎస్ వివరణ*

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 29, 2021 (డిఎన్ఎస్):* విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలంలోని కుడుముసర గ్రామంలోని వరద నీటిలో ఒక వ్యక్తి ఒక చిన్నారిని చేత్తో పైకెత్తి పట్టుకుని కాలువ దాటుతున్న ఫోటో 2019 నాటిది అని రాష్ట్ర

ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ డిఎన్ఎస్ కు తెలియచేసారు. 

ప్రస్తుతం గులాబ్ తుఫాను తాకిడికి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయినా ఘటనల్లో సోషల్ మీడియా లో ఒక ఫోటో వైరల్ అవుతుంది.  సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ ఫోటోను అయన దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. దీనిపై విచారణ జరిపి విషయం

తెలియచేస్తామని చెప్పడం జరిగింది. 

వైరల్ అవుతున్న సమాచారం : 

ఇది బాహుబలి దృశ్యం కాదు బతుకు చిత్రం విశాఖ మన్యంలో రహదారులు, వంతెనలూ లేక గిరిజనులు పడుతున్న ఇబ్బందులకు ప్రతిబింబం ఆ తండ్రి సాహసం చేశాడు బిడ్డను చేతులతో పైకెత్తి తలమీద పెట్టుకొని పీకల్లోతు వాగులోకి దిగి ఇవతలి ఒడ్డుకు చేరాడు

లోతుగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి బిడ్డను తీసుకెళ్లాడు. విశాఖ జిల్లా చింతపల్లి మండలంలోని కుడుముసారి గ్రామం వద్ద

సీఎస్ ఆదిత్యానాద్ వివరణ: 

ఈ చిత్రం ఆగస్టు 2019 నాటిది. ప్రస్తుతం విశాఖ జిల్లా చింతపల్లి మండలంలోని కుడుముసారి గ్రామం వద్ద రూ. 310 లక్షల వ్యయంతో పంచాయితీరాజ్ నిధులతో బ్రిడ్జి లను నిర్మించడం

జరిగిందన్నారు. ఈ ఫోటో పాతఫోటో అని, ప్రస్తుతం ఆ ప్రాంతం సురక్షితంగా, ప్రజలకు అనుకూలంగానే ఉందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 6, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam