DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇండి కూటమికే మా మద్దతు: ఆర్ఎస్ఎస్ పేరిట మూన్ ప్రెస్ మీట్

*మోడీ ని అడ్డుకోడానికి ప్రతిపక్షాలు వేస్తున్న తిక్కవేషాలు ఇవే* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

విశాఖపట్నం, మార్చి 31, 2024 : (డి ఎన్ ఎస్):* ఈసారి బీజేపీ కి ఓటు వెయ్యద్దు, , ,దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఇండి కూటమికి ఓటు వెయ్యాలి అని నిర్ణయం తీసుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధ్యక్షులు గా

చెప్పుకుంటున్న జనార్దన్ మూన్ ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశం మహారాష్ట్రలోని నాగ్ పూర్ లోనే రెండు రోజుల క్రితం నిర్వహించారు. అయితే ప్రఖ్యాత సంస్థ పేరిట పత్రిక సమావేశం అనగానే పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు సైతం హాజరయ్యారు. వేదికపై జనార్దన్ మూన్, అనే వ్యక్తి ఆర్ ఎస్ ఎస్ అధ్యక్షునిగా మీడియా తో మాట్లాడడం అందరిని

విస్మయానికి గురి చేసింది. పైగా ఈ సారి తాము కాంగ్రెస్ కు ఓటువేయాలని తీర్మానించుకున్నట్టు ప్రకటించేశారు. వీళ్ళ దుశ్చర్యలపై మండిపడ్డ ఆర్ ఎస్ ఎస్ అభిమానులు వ్యక్తిగతంగా పోలీసులకు ఫిర్యాదు చేసారు. అందరూ ప్రశ్నించగానే తానూ డూప్లికేట్ అని మూన్ ఒప్పేసుకున్నారు. ఇతను కాంగ్రెస్ స్థానిక కార్యకర్త.  

పురాణాల్లో

పౌండ్రక వాసుదేవుడు ఉన్నట్టుగా ఇతను ఆర్ ఎస్ ఎస్ ను పేరుతొ ఒక డూప్లికేట్ సంస్థ ను ఏర్పాటు చేసుకున్నాడు. 

నిబద్దత కల్గిన కోట్లాది మంది ఆర్ఎస్ ఎస్ సభ్యులను అయోమయం చేసి, కంగాళీ చెయ్యడం కోసమే ఈ సాహసానికి పూనుకున్నట్టు నిజం చెప్పేసారు. ఎన్నికల సమయంలో ఇలాంటి తిక్క వేషాలు వేయిస్తున్న అసలు దోషులను పట్టుకునే

ప్రయత్నం లో పోలీసులు విభాగం ఉంది. అయితే ఈ తిక్కవేశాన్ని ఎవరు వేయించారు అనే విషయం మాత్రం బయట పెట్టలేదు. 

మోడీ కి దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ ఓర్వలేని ప్రతిపక్షాలు ఈ సాహసానికి ఒడిగట్టిఉంటారనే అనుమానాలు అందరిలోనూ నెలకొని ఉన్నాయి.  
దీనిపై జాతీయవాదులు సీరియస్ గానే ఉన్నారు. ఈ కుట్ర వెనుక ఉన్నవారి పై

కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. 

గత 99 ఏళ్ళ కాలం లో ఆర్ ఎస్ ఎస్  నేటివరకూ ఒక పార్టీ కి ఓటు వెయ్యమని ప్రజలకు బహిరంగంగా ఎన్నడూ చెప్పిన దాఖలాలే లేవు. 
ఇంతవరకూ ప్రస్తుత ఆర్ ఎస్ ఎస్ అధినేత  ( సర్ సంఘ్ చాలక్ ) మోహన్ భగవత్ విలేకరుల సమావేశం నిర్వహించింది లేదు. ఆర్ ఎస్ ఎస్ పేరిట విలేకరుల సమావేశం

అని ఆహ్వానం రాగానే పెద్ద సంఖ్యలో విలేకరులు పాల్గొన్నారు. 
వ్యవస్థాపకులు డాక్టర్  హెడ్జ్ వార్ , గురూజీ గోల్వార్కర్ లు ఏనాడూ మీడియా ముందుకు రాలేదు. 

ఆర్ఎస్ ఎస్ నుంచి ఒకటి, రెండు సందర్భాల్లో మాత్రమే కేవలం బాలాసాహెబ్, సుదర్శన్ జి, రజ్జు భయ్యా మాత్రమే విలేకరుల సమావేశం నిర్వహించారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 30, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam