DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మొంకి పట్టు వీడకపొతే...అభ్యర్థులతో పాటు పార్టీయే పోయే ఛాన్స్

*జీవ సత్తా లేని అభ్యర్థులను మోయలేం.. క్యాడర్ ఎదురుదాడి*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

విశాఖపట్నం, ఏప్రిల్  01, 2024 : (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థులు చాలామంది ఏక్ దిన్ కా సుల్తాన్ లు గా మారిపోయారా అంటే అవుననే తెలుస్తోంది. కలిసి పోటీ చెయ్యాలి అనుకోడం సరే. .అభ్యర్థులకు

ప్రజా బలం, అర్ధ బలం, అంగబలం ఉండాలి కదా... కనీసం ఊరు పేరు లేని వాళ్ళకి టికెట్లు ఇచ్చేసి జనం మీద రుద్దుదాం అనుకుంటే క్యాడర్ ఒప్పుకునే స్థితి లేదు. బీజేపీ అంటేనే బొత్తిగా జనం లేని పార్టీ అని అభిప్రాయం ఉంది. అలాంటిది తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉన్న అనపర్తి, అనకాపల్లి, రాజమండ్రి, పాడేరు, తదితర ప్రాంతాల్లో బీజేపీ

అభ్యర్థులను లోక్ సభ, అసెంబ్లీ లకు ఎంపిక చేసింది. వీరిలో కనీసం డిపాజిట్ కూడా సాధించగలిగే స్థాయి కూడా ఎందరికి ఉందొ తెలియదు. పైగా వీరిలో ఒక సామాజిక వర్గ బంధువులు ఎక్కువగా ఉండడంతో పార్టీ క్యాడర్ కూడా సుముఖంగా లేరు. 
ఇక ఆయా ప్రాంతాలకు సంబంధం లేని వాళ్ళని బలవంతంగా క్యాడర్ పై రుద్దడాన్ని సహించడం లేదు. ప్రధానంగా

అనపర్తి అసెంబ్లీ లో కనీసం సింగల్ డిజిట్ కూడా దాటలేని వ్యక్తి కి సీటు కేటాయించిన ఘనత బీజేపీ కె దక్కింది. అక్కడ టీడీపీ విజయ విహారం చేసే అవకాశం ఉంది. 

అనపర్తి స్థానం రాజమండ్రి లోక్ సభ అభ్యర్థి గెలుపు ను శాసిస్తుంది. రాజమండ్రి  బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లోక్ సభ అభ్యర్థిగా పోటీ లో ఉన్నారు.

అనపర్తి ప్రభావం చూపిస్తే ఈమెకు డిపాజిట్ రావడం కూడా అతి కష్టంగా కనపడుతోంది. పైగా రాజమండ్రి పరిధిలో బీజేపీ కి పెద్దగా క్యాడర్ లేదు. టీడీపీ అభ్యర్థులు బీజేపీ కి ఓటు వెయ్యమని చెప్తారు అన్న నమ్మకం ఈ క్యాడర్ లో లేదు. 
పొత్తులో మూడు పార్టీలు ఉన్నా ఎవరి ఎన్నిక వారిదే అన్నట్టుగా జరుగుతోంది. 

అదే విధంగా

అనకాపల్లి లోక్ సభ కోసం ఈ జిల్లాలకే ఏమాత్రం పరిచయం లేని సీఎం రమేష్ ను కడప నుంచి  తీసుకు వచ్చి ఇక్కడ బరిలోకి దింపారు. ఇతను ఆర్థికంగా బలవంతుడి తప్ప క్యాడర్ ఏమాత్రం లేదు. కనీసం ఈ నియోజక వర్గం పరిధి కూడా తెలియని వ్యక్తి. ఇక్కడ బీజేపీ కి కనీసం పదిమంది కార్యకర్తలు కూడా లేదు. 
ఈ ప్రాంతంలో తెలుగుదేశం కు కంచుకోట.

ప్రత్యర్థులకు ఎంత పట్టు ఉన్నా. . .విజయం సాధించే దమ్ము ఉన్నవాళ్లు అభ్యర్థులుగా ఆశావహులై ఉన్నారు. వాళ్ళందరిని ప్రక్కన బెట్టి బీజేపీ అపరిచితుణ్ణి తమపై రుద్దడాన్ని టీడీపీ క్యాడర్ సహించలేకపోయారు. 
ఈ ప్రాంతంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాల్లో బిసి సామాజిక వర్గం వాళ్ళు అధికంగా ఉన్నారు. వాళ్ళు ఎంతవరకూ సహకరిస్తారో

అనుమానమే. చివరి నిమిషం లో పార్టీ మారినా ఆశ్చర్యపోనక్కరలేదు. 
ఇతను రాజ్య సభ సభ్యునిగా ఉన్నప్పడికి ప్రజల్లో పెద్దగా పరిచయం లేకపోవడం గమనార్హం. పైగా ఇతను తెలుగుదేశం పార్టీ కి చెందిన వాడు అని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం లో ఉంది. ఓటర్లు నమ్మి ఓటు వేసే అవకాశం అతి తక్కువ. 

అరకు, పాడేరు ప్రాంతాల్లో బీజేపీ

పేరు విన్నవాళ్ళు కూడా అతి తక్కువమంది ఉంటారు. కారణం ఇవి గిరిజన ప్రాంతాలు. ఎక్కువగా టీడీపీ క్యాడర్ మాత్రమే క్షేత్ర స్థాయిలో పనిచేస్తుంది. అలాంటి చోట్ల ఈ రెండు సీట్లను బీజేపీ కి కేటాయించారు. ఈ అభ్యర్థులకు పెద్దగా ప్రజాదరణ కూడా ఉన్నట్టు లేదు. 

ఇదే అభ్యర్థులతో బీజేపీ-టీడీపీ కూటమి ఎన్నికల్లోకి వెళితే. .

మరోసారి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా అధికారాన్ని అప్పగించడం అవుతుంది. 

బీజేపీ లో సైతం కొన్ని ప్రాంతాల్లో గెలిచే బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఆ స్థానాలను బీజేపీ పూర్తిగా ప్రక్కన బెట్టి, కచ్చితంగా ఓడిపోయే స్థానాలను పట్టుబట్టి మరీ సాధించడం అంటే ప్రత్యర్థులతో లాలూచీ పడ్డట్టు గానే

కనపడుతోంది. 

టీడీపీ క్యాడర్ నుంచి ఎదురవుతున్న నిరసనల నేపథ్యంలో కొన్ని సీట్లను తప్పనిసరిగా మార్చుకోవాల్సిన స్థితి వచ్చేసింది. లేనిపక్షంలో ఆయా ప్రాంతాల్లో టీడీపీ సహాయ నిరాకరణ చేసి, పార్టీని వీడే అవకాశం ఎక్కువగా ఉంది. 

ఈ విపత్కర పరిస్థితులను కూటమి పెద్దలు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.

ఇప్పుడు ఎంపికైన అభ్యర్థులు చివరి వరకూ ఉంటారో లేదో తెలియాలి. పార్టీ పెద్దల మొంకి పట్టు వీడక పొతే. . .అభ్యర్థులతో పాటు మొత్తం పార్టీయే తుడిచిపెట్టుకు పోయే స్థితి వచ్చేసింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 30, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam